కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడంలో కీలకంగా మారిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషదం భారత్ అమెరికాల మధ్య నెలకొన్న శాంతియుత వాతావరణాన్ిన భగ్నం చేస్తోందా.? అంటే అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తోంది. ఓ వైపు కరోనా రక్కసి ప్రపంచ దేశాలపై తన పంజా విసిరి.. ప్రజల ప్రాణాలను కటళించి వేస్తోంటే.. అమెరికా మాత్రం తనకు కావాల్సిన ఔషదాల కోసం భారత్ పై హెచ్చరికలు జారిచేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వున్న ద్వైపాక్షిక సంబంధాలు కూడా దెబ్బతింటాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్ మన్నించకపోతే ప్రతీకార చర్యలు వుంటాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయడమే ఈ పరిణామాలుకు అసలు కారణం. తన విన్నపాన్ని భారత్ మన్నించి నిషేదాన్ని ఎత్తివేయకపోతే అది తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికాతో భారత్ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆయన మీడియా తో అన్నారు,
కాగా, కరోనా వైరస్ వ్యధి తీవ్రత నేపథ్యంలో తాను భారత్ ప్రధాని నరేంద్రమోడీ క్లోరోక్విన్ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?’’ అని సోమవారం శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఔషధ రంగంలో అమెరికాకు భారత్ సుదీర్ఘకాలం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోందని యూఎస్ విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్ జీ వెల్స్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనీపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more