యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణమృదంగం మ్రోగిస్తోంది. ఏకంగా 21 వేల మంది ప్రజల ప్రాణాలను కబళించి వేసింది. ఈ మరణాలు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య శనివారం 15 వేలు దాటగా,. ఇవాళ్టికి 21 వేలకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 21,200 మంది చనిపోయారు. చైనా నుంచి వ్యాపించిన ఈ వైరస్ కొద్ది రోజుల్లోనే దేశాలకు పాకింది. ఈ వైరస్ కు విరుగుడు, మందు లేకపోవడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. చైనా ఈ వైరస్ ని నియంత్రించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతోంది. ఇటలీలో మాత్రం మరణమృందంగం మ్రోగిస్తోంది. వేలాది సంఖ్యలో చనిపోతున్నారు. గురువారం ఉదయం వరకు ప్రపంచ వ్యాప్తంగా 21, 200 మందిని బలి తీసుకుంది ఈ మహమ్మారి. మొత్తం 4 లక్షల 68 వేల 905 మందికి ఈ వైరస్ సోకింది. అందులో 14 వేల 792 మందికి సీరియస్ గా ఉంది. 3 లక్షల 33 వేల 487 మంది ఈ వైరస్ తో పోరాడుతుంటే...లక్షా 14 వేల 218 మంది కోలుకున్నారు. 198 దేశాకు కరోనా వైరస్ విస్తరించింది.
ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే..
ఇటలీ : 7,503. స్పెయిన్ : 3,647. చైనా : 3,287, ఇరాన్ : 2, 077. ఫ్రాన్స్ : 1,331, యూఎస్ఐ : 994. యూకే : 465. నెదర్లాండ్స్ : 356. జర్మనీ : 206, బెల్జియం : 178. స్విట్జర్లాండ్ : 153. సౌత్ కొరియా : 126.
మన దేశంలోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 630 కేసులు నమోదుకాగా, తాజాగా మూడు మరణాలతో దేశంలో మృతుల సంఖ్య 15కు చేరింది. గురువారం దేశవ్యాప్తంగా మొత్తం పది కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 128 కేసులు నమోదు కాగా, ఆ తరువాత కేరళలో 118 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51కు చేరింది. తెలంగాణలో ఏకంగా 41 కేసులు నమోదు కాగా, ఇటు ఏపీలో తాజాగా నమోదైన రెండు కేసులతో ఈ సంఖ్య పదికి చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more