మధ్యప్రదేశ్ లో అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను అమోదించడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం మైనారిటీలోకి జారిపోయింది. దీంతో బలపరీక్షకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ‘‘15 నెలల పాటు రాష్ట్రాభివృద్దికోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రైతులు మాపై ఎంతో విశ్వాసం ఉంచార’’ని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించామని అయితే.. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపి అన్ని ప్రయత్నాలు చేసిందని అరోపించారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం బీజేపికి నచ్చలేదని కమల్నాథ్ విమర్శించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో కమల్నాథ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
జ్యోతిరాధిత్య సింధియా వెంటే తాము ఉంటామని ఎమ్మెల్యేలు కమల్ నాథ్ సర్కారుకు సంకేతాలు పంపించడంతో తొలుత వారిలో ఆరుగురి రాజీనామాల్ని స్పీకర్ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించారు. కాగా బలపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ బీజేపి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5గంటల వరకు డెడ్లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. దీంతో రాష్ట్రంలో బీజేపి సర్కారు ఏర్పడినా వీరంతా మళ్లీ అసెంబ్లీకి వెళ్లాళంటే మరోమారు ప్రజల్లోకి వెళ్లాల్సిందే.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు:
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య: 228
ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ
అదనంగా 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం
తాజాగా మద్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య: 206
బలపరీక్షలో పార్టీలకు కావాల్సిన సంఖ్యబలం: 104
బీజేపీ సభ్యుల సంఖ్య: మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more