కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ వాసుల గుండెల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంపైన స్పష్టంగా కనపిస్తోన్న ప్రభావం తాజాగా కరీంనగర్ వాసుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. అందుకు కారణం నిన్న ఒక్కరోజు తెలంగాణలో నమోదైన ఏడు కొత్త పాజిటివ్ కేసులు. ఇండోనేషియాకు చెందిన వ్యక్తులకు పరీక్షలు చేయగా వారిందరికీ కరోనా వైరస్ వుందని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య ఆరు నుంచి ఒకేసారి 13కు చేరింది. అయితే ఇదే వార్త ఇప్పుడు కరీంనగర్ వాసులను వణికిస్తోంది.
ఇండోనేషియాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ నెల 14, 15 తేదీల్లో పట్టణంలో పర్యటించారు. వారిలో 8 మందికి కరోనా సోకినట్టు తేలడంతో పట్టణం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పట్టణంతోపాటు వారు ఇండోనేషియా వాసులు పర్యటించిన ప్రాంతాలపై దృష్టిసారించారు. వారు ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో పర్యటించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే వారు తిరిగిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ జిల్లాలో మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్లో 48 గంటలపాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా నుంచి వచ్చిన వారు పర్యటించిన కలెక్టరేట్ కు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆ ప్రాంతాల ప్రజలు వైద్యులకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. ఆ జిల్లాలో 100 ప్రత్యేక బృందాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు ఆ జిల్లాలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి, వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more