రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో పోలీసుల పలు ప్రశ్నలకు సమాధానాలు లభించాయని తెలుస్తోంది. నివేదికతో వెలుగుచూసిన పలు విషయాలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మృతురాలు తెలంగాణ వాసి కాదని బహుశా మహారాష్ట్ర లేదా గుజరాత్ కు చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మెడకు ఉరి వేసి, అనంతరం బండరాయితో మోది హత్య చేసినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే మహిళ గొంతు నులిమినట్లు ఆనవాళ్లు గుర్తించారు.
ఈ కేసులో మృతురాలి ఆభరణాలు కీలక ఆధారాలుగా మారాయి. వాటి సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తనమూనాలు, విశ్రా శాంపిల్స్ ఉస్మానియా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిచారు. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు వివాహితగా వైద్యులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దిశ -2 క్రైమ్ ను సవాలుగా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఒంటిపై బంగారు ఆభరణాలు, మరోవైపు పోలీసుల కోణంలో జరుపుతున్న దర్యాప్తులో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసులో నాలుగు వాహనాలు అనుమానంగా ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన అడ్రస్ లను కూడా ట్రేస్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు..వారి అభిప్రాయం కూడా పోలీసులకు వెల్లడించారు. తొలుత మహిళను హతమార్చిన తర్వాత వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి కల్వర్టు కింత పడేసి అక్కడ తలపై మోదడంతో తల నుజ్జునుజ్జు కావడంతో స్పాట్ లోనే చనిపోచయినట్లు తెలుస్తోంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళ వివాహిత, ఆమెకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లను సేకరించారు. దీనికి సంబంధించి ప్రైమరీ రిపోర్టు పోలీసులకు అందించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కొన్ని విషయాలను పోలీసులకు వెల్లడించారు.
మహిళలకు స్పోకింగ్ అలవాటు ఉంటుందన్న విషయాన్ని వైద్యుల నివేదిక ద్వారా తెలుసుకన్న పోలీసులు అమె చిరునామాను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసులో చనిపోయిన మహిళ ఎవరు.? హత్య చేసింది ఎవరు.? ఒక్కరి ప్రమేయంతోనే జరిగిందా.? లేక మరెవరి హస్తమైనా వుందా.? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు కూడా ఈ కేసులో కీలకం కానున్నాయి. సీసీ కెమెరాలు కూడా కీలకంగా మారాయి. తంగెడ్ పల్లి గ్రామంలో రోడ్డు కల్వర్టు వికారాబాద్ నుంచి సంగారెడ్డి మార్గంమధ్యలో జరిగింది కాబట్టి ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more