Auto driver thrashed by tenth student mother ఆటో డ్రైవర్ ను చావచితక కొట్టిన విద్యార్థిని తల్లి

Mother thrashes miscreant harassing her daughter video creates ripples

mother thrashed auto driver, West Godavari auto driver thrashed, girl student mother thrashed auto driver, tenth studying student mother, auto driver thrashed in palakoderu, auto driver thrashed video, auto driver harassement, auto driver eve teasing, perupalem auto driver, Girl student, mother, auto driver, tenth student, Perupalem, Vissakoderu, Palakoderu Mandal, West Godavari, harassment, Assault, Andhra Pradesh, Crime

A mother in West Godavari thrashed an auto driver who harassing her tenth studying daughter from the past few days. According to the sources, an auto driver belongs to Perupalem harassing a tenth studying student in Vissakoderu, Palakoderu Mandal.

ITEMVIDEOS: ఆటో డ్రైవర్ ను చావచితక కొట్టిన విద్యార్థిని తల్లి

Posted: 03/17/2020 06:17 PM IST
Mother thrashes miscreant harassing her daughter video creates ripples

ఆడపడచులకు అండగా వుండేందుకు రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అబలల పరిరక్షణకు నూతనంగా దిశ చట్టంతో పాటు దిశ పోలిస్ స్టేషన్లను తీసుకువచ్చింది. ఈ చట్టం కింద కేసులు నమోదైన పక్షంలో త్వరితగతిన శిక్షలు పడటంతో పాటు కఠినమైన చర్యలు కూడా వుంటాయన్న పోలీసుల హెచ్చిరకలతో రాష్ట్రంలో అడపడచులపై అకతాయిల వేధింపులు తగ్గుముఖం పట్టాయి. కాగా ఈ చట్టం గురించి తెలియని వారు కూడా ఇంకా రాష్ట్రంలోఅనేకమంది వున్నారు. నిద్ర లేచింది మొదలు, నిద్రపోయేంత వరకు వారికి ఆమ్మాయిలను వేధించడమే పని.

ఈ నేపథ్యంలో ఇలాంటి ఓ అకతాయి అటో డ్రైవర్ కు ఓ విద్యార్థిని తల్లి మర్చిపోలేని విధంగా.. ఇకపై అలాంటి అలోచన అక్కడి విద్యార్థుల్లోనూ రాకుండా స్కూల్ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అక్కడిక్కక్కడే మంచి ట్రీట్ ఇచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్పాకొడేరు గ్రామానికి చెందిన పదో తరగతి అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తొలుత పట్టించుకోలేదు. దీంతో ప్రతీరోజు వెనకాలే వస్తుండటంతో భయపడిన విద్యార్థిని.. తన తల్లి విషయం చెప్పడంలో అమె వచ్చి చాకచక్యంగా అటోడ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసింది.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్సా కోడేరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే ఈ గ్రామానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వున్న పేరుపాలెంకు చెందిన ఆటోడ్రైవర్ నెల రోజులకు పైగా బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆటోలో వెళ్తున్నప్పుడు ఒంటిపై చేతులు వేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమించిపోవడంతో తట్టుకోలేని బాలిక చివరికి తల్లిదండ్రులకు చెప్పింది.

వారు ఎంతో చాకచక్యంగా ఆటో డ్రైవర్ ను పట్టుకున్నారు. ఆ వెంటనే అదే పాఠశాలలోకి తీసుకెళ్లి అసెంబ్లీ ప్రాంగణంలోని అడిటోరియంలోనే వాడ్ని చావచితక కోట్టారు. బాలిక తల్లితోపాటు కుటుంబ సభ్యులందరూ కలిసి అతన్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులను వేధిస్తున్నాడని సదరు బాలిక తెలపడంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles