ఆడపడచులకు అండగా వుండేందుకు రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అబలల పరిరక్షణకు నూతనంగా దిశ చట్టంతో పాటు దిశ పోలిస్ స్టేషన్లను తీసుకువచ్చింది. ఈ చట్టం కింద కేసులు నమోదైన పక్షంలో త్వరితగతిన శిక్షలు పడటంతో పాటు కఠినమైన చర్యలు కూడా వుంటాయన్న పోలీసుల హెచ్చిరకలతో రాష్ట్రంలో అడపడచులపై అకతాయిల వేధింపులు తగ్గుముఖం పట్టాయి. కాగా ఈ చట్టం గురించి తెలియని వారు కూడా ఇంకా రాష్ట్రంలోఅనేకమంది వున్నారు. నిద్ర లేచింది మొదలు, నిద్రపోయేంత వరకు వారికి ఆమ్మాయిలను వేధించడమే పని.
ఈ నేపథ్యంలో ఇలాంటి ఓ అకతాయి అటో డ్రైవర్ కు ఓ విద్యార్థిని తల్లి మర్చిపోలేని విధంగా.. ఇకపై అలాంటి అలోచన అక్కడి విద్యార్థుల్లోనూ రాకుండా స్కూల్ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అక్కడిక్కక్కడే మంచి ట్రీట్ ఇచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్పాకొడేరు గ్రామానికి చెందిన పదో తరగతి అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తొలుత పట్టించుకోలేదు. దీంతో ప్రతీరోజు వెనకాలే వస్తుండటంతో భయపడిన విద్యార్థిని.. తన తల్లి విషయం చెప్పడంలో అమె వచ్చి చాకచక్యంగా అటోడ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసింది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్సా కోడేరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే ఈ గ్రామానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వున్న పేరుపాలెంకు చెందిన ఆటోడ్రైవర్ నెల రోజులకు పైగా బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆటోలో వెళ్తున్నప్పుడు ఒంటిపై చేతులు వేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమించిపోవడంతో తట్టుకోలేని బాలిక చివరికి తల్లిదండ్రులకు చెప్పింది.
వారు ఎంతో చాకచక్యంగా ఆటో డ్రైవర్ ను పట్టుకున్నారు. ఆ వెంటనే అదే పాఠశాలలోకి తీసుకెళ్లి అసెంబ్లీ ప్రాంగణంలోని అడిటోరియంలోనే వాడ్ని చావచితక కోట్టారు. బాలిక తల్లితోపాటు కుటుంబ సభ్యులందరూ కలిసి అతన్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులను వేధిస్తున్నాడని సదరు బాలిక తెలపడంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more