కరోనా వైరస్ ఉష్ణవాతావరణ స్థితి కలిగిన తెలంగాణలోకి రాదంటూ చేసిన ప్రచారాలు నిజం కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రెండో కరోనా వైరస్ బారిన పడిన పేషంట్ కు పాజిటివ్ రిపోర్టు రావడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రజారోగ్యం పరిస్థితులను పరిరక్షించేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ప్రకటించింది.. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించామని చెప్పారు. కేవలం ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ విధంగా తాము వ్యవహరిస్తున్నామన్నారు.
రాష్ట్రానికి ఇటలీ నుంచి వచ్చిన మహిళలలో కరోనా వ్యాధి లక్షణాలు వున్నాయని తెలుసుకన్న అధికారులు అమెను గాంధీ అసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్సను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, సదరు మహిళకు పరీక్షలు నిర్వహించామని.. నివేదికలో అమె పాజిటివ్ అని వెలువరించిందని తెలిపారు. ఇక ఈమెతో పాటు వచ్చిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని క్వారంటైన్ చేస్తున్నామని, వారి నివేదికలు వచ్చిన తరువాత తదుపరి వైద్యం అందిస్తామన్నారు. ఈ క్రమంలో వైరస్ లక్షణాలు వున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతన్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
అయితే ఈ నేపథ్యంలో భయాందోళనకు గురికావాల్సినంద అవసరం లేదన్నారు. యావత్ దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని... ఇద్దరు మరణించారని చెప్పారు. ప్రపంచాన్ని ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు వణికిస్తాయని అన్నారు. మందుస్తుచర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై అరోగ్యశాఖ.. మిగతాశాఖలను సమన్వయంతో సమావేశం నిర్వహిస్తోందని.. ఈ కమిటీతో సాయంత్రం క్యాబినెట్ కూడా భేటీ కానుందని.. ఈ తరుణంలో ముందస్తుగా మరిన్నీ చర్యలను ఎలా తీసుకోవాలన్న విషయమై చర్చించనున్నామని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎవరైనా ఈ లక్షణాలు కనిపిస్తే వారిని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్న ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చేవారిని మాత్రం మిగతా ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వికారాబాద్ లోని అనంతగిరిపై వున్న టూరిజం శాఖ గెస్ట్ హౌజ్ సహా దూలపల్లిలో ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ ను కూడా ఆరోగ్యశాఖ అధీనంలోకి తీసుకుందని, విదేశీయుల్ని ఇక్కడకు తరలిస్తామని పేర్కోన్నారు. కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి ఎవరొచ్చినా... వారిని 14 రోజులు ఐసొలేషన్ లో ఉంచుతున్నారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more