suspected coronavirus patients scare of isolation treatment కరోనా వైరస్: చికిత్సకు జడుస్తున్న పేషంట్స్

Coronavirus infected techie s wife fled bengaluru by air took delhi agra train tests ve

Coronavirus outbreak, Health administration, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, Google Employee, google india techie wife, Agra woman, parents, quarantine, isolation ward, siddiqui, Gulburga hospital staff, Bengaluru, karnataka, politics

A 25-year-old Agra woman whose husband, a Google employee, tested positive for novel coronavirus in Bengaluru earlier this week, also tested positive. According to health officials, the woman escaped from Bengaluru on March 8, took a flight to New Delhi and travelled to Agra to be with her parents. She recently returned from her honeymoon in Italy and was put under quarantine after her husband showed symptoms of the disease

కరోనా వైరస్: లక్షణాలు వున్నా చికిత్సకు జడుస్తున్న పేషంట్స్

Posted: 03/14/2020 12:15 PM IST
Coronavirus infected techie s wife fled bengaluru by air took delhi agra train tests ve

కరోనా వైరస్ పేరు చెబితే.. జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేరు చెబితేనే దడుచుకునేలా చేస్తున్న ఈ వ్యాధి.. తమకు సోకిందని తెలిస్తే.. ఆ రోగుల పరిస్థితి ఎలా వుంటుందో తలచుకుంటేనే భయమేస్తోంది. లక్షణాలు బయటపడితేనే కారంటైన్ చేస్తుండగా, ఇక వారి రిపోర్టులో పాజిటివ్ అని తేలితే.. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించడంతో పాటు కోలుకునే వరకు చికిత్సను అందిస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఓ మహిళ.. కరోనా లక్షణాల వున్నాయని తెలుసుకుందో ఏమో తెలియదు కానీ.. అమె ఏకంగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఇంతకీ ఎవరామె అంటారా..

బెంగుళూరులోని గూగుల్ ఇండియాకు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీరుకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందే. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న వైద్యులు.. క్వారంటైన్ చేసి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన అతని భార్య పుట్టింటికి పారిపోయింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు విమానంలో ప్రయాణించిన అమె అక్కడి నుంచి రైలులో అగ్రాకు చేరుకుంది. అయితే టెక్నీ తన భార్యతో కలసి ఇటలీకి హనీమూన్ ట్రిఫ్ కు వెళ్లివచ్చారని, అక్కడే ఆయన ఈ వైరస్ బారిన పడ్డాడని తెలుసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

అదే సమయంలో క్యాంపస్ లోని ఉద్యోగులందరినీ 'వర్క్ టు హోం'కు ఆదేశించారు. దీంతో భర్తతోపాటు భార్యకు వైరస్ సోకే అవకాశం ఉందని బెంగళూరు వైద్యులు ఆగ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని వైద్యుల బృందం టెకీ భార్య పుట్టింటికి వచ్చారు. వారు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడంతో కలెక్టర్, పోలీసులు జోక్యం చేసుకోవడంతో టెకీ భార్య అంగీకరించింది. ఆమెకు వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆమెతోపాటు మొత్తం కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక మన దేశంలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. క్రమంగా ఈ సంఖ్య వంద మార్కును దాటుతోంది. ఇదే సమయంలో దేశంలో నేటికి రెండు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 9 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వీరిలో పంజాబ్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన దంపతులు. వీరిద్దరూ కేరళలోని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కరోనా బాధితులు అదృశ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఐసోలేషన్ వార్డుల నుంచి తప్పించుకున్న రోగులకు సంబంధించిన సమాచారం అన్ని రాష్ట్రాలకు కేంద్ర అరోగ్యశాఖ పంపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles