ఆంధప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరిస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యకేసులకు సంబంధించిన సమయం కూడా కేసుల్లో కీలక ఆధారంగా మారుతుందని అభిప్రాయపడిన న్యాయస్థానం.. ఈ కేసును వెంటనే సీబిఐకి అప్పగించాలని అదేశించింది.
ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ హత్య జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం కనుక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని సూచించింది.
పులివెందుల పోలీస్ స్టేషన్నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. కాగా, 2019 మార్చి 15 వైఎస్ వివేకా హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, తదితరులు గతంలో పిటిషన్లు వేశారు.
ఇదిలావుండగా న్యాయస్థానం తీర్పుపై టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందిస్తూ.. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకం అని అభివర్ణించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం నిర్ణయంతో కొందరికి కాళ్లలో వణుకు, వెన్నులో చలి, కళ్లలో బెరుకు తదితర లక్షణాలు మొదలయ్యాయని వ్యంగ్యం ప్రదర్శించారు. హైకోర్టు తీర్పుతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం కంపించిపోయిందని, ఈ నిర్ణయం సీఎం జగన్ కు, ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more
May 16 | సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ... Read more
May 16 | ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. వర్షంతో పాటు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం స్థంభించింది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, అపార ఆస్తినష్టం వాటి్ల్లినట్లు... Read more
May 16 | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో పడిన రక్తపు మరకలు గడ్డకట్టకముందే.. మరో రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత మార్మోగాయి. బఫెలో కాల్పుల ఘటన... Read more
May 16 | పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిని ముద్దు పెట్టుకోవడంతో పాటు అతని రహస్యబాగాలను తాకడం అసహజ లైంగిక చర్య (అన్నాచురల్ సెక్సువల్ అసల్ట్) కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలుడిని ముద్దు... Read more