మధ్యప్రదేశ్లోని ముఖ్యమంత్రి కమల్ నాథ్ సర్కారుకు షాకిచ్చిన సినియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటూ.. రాజ్యసభకు ఎంపికై ఆ తరువాత కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టాలని భావిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో సింధియాపై వ్యంగోక్తులు విసిరారు. అంతేకాదు కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో ప్రజలు ఎదుర్కోంటున్న అసలైన సమస్యలను ఎత్తిచూపారు. ప్రజలను నిత్యం భావోద్వేగాలకు గురిచేయడం ఎవరి తరం కాదని.. ప్రజలు అసలు విషయం గ్రహిస్తే.. బీజేపి కనీసం యాభై, అరవై ఏళ్లు అధికారానికి దూరంగా వుంటుందని విమర్శించారు.
భారత్కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో గొప్ప భవిష్యత్తు ఉంటుందని జ్యోతిరాదిత్య భావిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ పాలనలో బ్యాంకులు కుప్పకూలుతున్నాయని, రూపాయి మారకం విలువ పతనమవుతోందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకుందని, సామాజిక వ్యవస్థ నాశనం అవుతోందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, అమిత్ షాల నేతృత్వంలో దేశానికి మంచి భవిష్యత్తు ఉందని జ్యోతిరాదిత్య భావిస్తున్నారని చురకలంటించారు.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి.. అన్నదాతలు తమను ఆదుకునే వారెవరంటూ అర్థనాథాలు చేస్తున్నారు.. నిరుద్యోగులు తమకు ఉపాధి అవకాశాలు ఎప్పుడోచ్చేనా అని ఎదురుచూస్తున్నారు అయినా జ్యోతిరాధిత్య సింధియాకు మాత్రం బీజేపిలో చక్కని భవితవ్యం కనిపించిందంటూ ఆయన వ్యంగోక్తులు విసిరారు. కేంద్ర మంత్రిగా అమిత్ షాను లేక నిర్మల సీతారామన్ను తొలగించి ఆ స్థానంలో జ్యోతిరాదిత్యను నియమించాలని ఆయన అన్నారు. వారిద్దరు చేసే పనిని ఆయన కచ్చితంగా వారి కన్నా మెరుగ్గా చేస్తారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చివరగా 'మహారాజా.. మీకు మా శుభాకాంక్షలు’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు.
కాగా తాను గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేశానని పేర్కోన్నసింధియా.. ఇప్పుడు మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని... తాను ఈ దిశగా ఏడాది క్రితం నుంచే ఆలోచిస్తున్నాననే విషయం మీకు తెలుసని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం తనకు ముందు నుంచి ఉందని... అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన లక్ష్యాన్ని తాను సాధించలేనని చెప్పారు. కాగా కాసేపట్లో ఆయన ప్రధాని, అమిత్ షా సమక్షంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఆధ్వర్యంలో బీజేపిలో చేరనున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more