ముఖ్యమంత్రి కేసీఆర్, పారిశ్రామికవేత్త ‘మై హోం కన్స్ ట్రక్షన్స్’ అధినేత జూపల్లి రామేశ్వరరావుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన అరోపణలు చేసిన రేవంత్ రెడ్డి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కేంద్రప్రభుత్వాన్ని అదేశించింది. రాష్ట్రానికి చెందిన పెద్దల నుంచే తనకు ప్రాణహానీ వుందన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి భద్రత కల్పన విషయంలో ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తన అదేశాల్లో పేర్కోంది. ఈ మేరకు రేవంత్ దాఖలు చసిన పిటీషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ సావిలి అదేశించారు.
తనకు కేంద్ర ప్రభుత్వం లేదంటే, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 గన్ మెన్లతో ఎస్కార్ట్ కల్పించాలని కోరుతూ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం కేంద్రప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఆరు వారాల వ్యవధిలో ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేయునున్న కొత్త పిటీషన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అదేశించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కొత్తగా మరో పిటీషన్ను కేంద్రహోం మంత్రిత్వశాఖకు సమర్పించాల్సిందిగా సూచించింది.
కాగా, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తనకు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని పొంచి వుందని పేర్కోంటూ రేవంత్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ఆయన పేర్కోన్నారు. గతంలో తనకున్న 3 ప్లస్ 3 గన్మెన్లతో రక్షణ ఉండేదని, ఆ తర్వాత దాన్ని 2 ప్లస్ 2కు తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more