ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వీడారు. ఆయన ఈ యోచనలో ఉన్నప్పుడే చిట్టచివరిగా ఓ ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాలను వీడొద్దంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయితే కొందరు మాత్రం వాసనను పసిగట్టారు. త్వరలోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాపై నిషేధాన్ని విధిస్తున్నారా.? అన్న అనుమానాలు కూడా పలువురు నెటిజనులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మనం ఎంత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటంపై ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు చేపడుతున్న ముందస్తు చర్యగా ప్రధాని నిర్ణయాన్ని అభివర్ణించారు. ‘‘ప్రధాని ఆకస్మిక నిర్ణయం దేశవ్యాప్తంగా ఆందోళనను రేకేత్తిస్తోంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు ముందస్తు చర్యగా దీన్ని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు మంచితో పాటు ఉపయోగకరమైన సందేశాలను పంచుకొనేందుకు ఒక వేదికగా ఉంటాయని ప్రధానికి కూడా తెలుసు. ఇది ద్వేషాన్ని వ్యాపింపచేయడం గురించి కాదు’’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ కూడా ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటం అనేది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న పనిగా ఆరోపించారు. రాజకీయ విమర్శకుడు, వాజ్ పేయి మాజీ సహాయకుడు సుధీంద్ర కులకర్ణి కూడా ప్రధాని ట్వీట్ పై స్పందించారు. ‘‘భారత ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కమ్యూనికేషన్ పై అతి పెద్ద దాడి. త్వరలో ప్రజాస్వామ్యంపై కూడా ఇటువంటివి జరగొచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం’’ అని ట్వీట్ చేశారు. అయితే ప్రధానిని ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్ బుక్లో 4.4 కోట్లు, ఇన్ స్టాగ్రాంలో 3.52 కోట్ల మంది అనుసరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more