యూరోప్ ఖండంలోని అతిచిన్న దేశమైన లగ్జెంబర్గ్.. ప్రజా రవాణాను ఉచితం చేసేసింది. ఇక ఈ దేశంలోని రైలు, మెట్రోలు, బస్సుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఈ వార్త వినగానే మన దేశంలో కూడా ప్రజా రవాణాను కనీసం రైలు ప్రయాణాలను ఉచితం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కదూ. లగ్జెంబర్గ్ ప్రజలు తీవ్ర వాయు కాలుష్యంతో రద్దీ సమయాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్లను చవిచూస్తున్న కారణంగా ఆ దేశం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంలో భాగంగా ప్రజలందరికీ ఉచిత రవాణా సౌకర్యం అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆ దేశ రవాణా మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏటా దాదాపు 100 యూరోలు ఆదా అవుతుందట. అయితే ఈ ఉచిత ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని సేవలను మినహాయించారు. రైళ్లలో ఫస్ట్ క్లాస్ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ‘ఉచితం’ వర్తించదు.
లగ్జెంబర్గ్.. యూరోప్ దేశాలలో అత్యంత చిన్నదేశ కావడంతో పాటు ఈ దేశంలో జనాభా కూడా కేవలం ఆరు లక్షల 14 వేలు మాత్రమే. అయితే బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య నెలకొన్న ఈ దేశానికి ప్రతినిత్యం ఈ మూడు దేశాల పౌరులు ఉద్యోగ, ఉఫాధి సహా ఇతర పనుల నిమిత్తం సుమారు రెండు లక్షల మంది వస్తుంటారు. అయితే వీరంతా సొంత వాహనాల్లో వచ్చివెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వాయు కాలుష్య సమస్యను ఆ దేశం ఎదుర్కోంటోంది. అయితే ఈ ఉచిత రవాణతో ఈ సమస్యకు చెక్ పడుతుందా.? అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
ఇందుకు ప్రధాన కారణం.. పోరుగు దేశాలతో పోల్చితే లగ్జెంబర్గ్ లో ఇంధన ధరలు చాలా తక్కువ. దీంతో పోరుగు దేశాలకు చెందిన వ్యక్తులు కూడా తమ పనులుంటే ఇక్కడి సొంత వాహనాల్లోనే వచ్చి తిరిగి వెళ్లేప్పుడు తమ కార్లలో ఇంధనాన్ని ఫుల్ చేసుకుని వెళ్తుంటారు. దీనికి తోడు.. లగ్జెంబర్గ్ దేశంలో ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా వున్నాయి. అయితే ఇంధన ధరలు మాత్రం చాలా తక్కువగా వున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు కూడా సొంత వాహనాల్లో ప్రయాణాలనే ఇష్టపడుతుండటం గమనార్హం. దీంతో ఈ దేశంలో ప్రతి వెయి మందిలో 700 మందికి కార్లు వున్నాయని అక్కడి గణంగాకలు స్పష్టం చేస్తున్నాయి.
2018లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 32శాతం మంది బస్సుల్లో, 19శాతం మంది మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తేలింది. మిగతా వారంతా తమ ప్రయాణాలకు కార్లు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్య స్థాయిలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో లగ్జెంబర్గ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ ఖర్చు లేకపోతే ప్రజలంతా ప్రజా రవాణాను ఉపయోగిస్తారని అక్కడి అధికారులు భావించి ఈ ఉచిత రవాణాను అందుబాటులోకి తెచ్చారు. మరి ప్రభుత్వ నిర్ణయం కాస్తానా ట్రాఫిక్, వాయు కాలుష్య సమస్యకు ఉపశమనం కలిగిస్తుందా.? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more