ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 74వ రోజుకు చేరాయి. ఇన్ని రోజులుగా తాము దీక్షలు, నిరసనలు చేస్తున్నా.. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, తమ మెర వినడం లేదని, తమను, తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని అమరావతి రైతలు పేర్కొంటున్నారు. తూళ్లూరు రైతులు, మహిళలు తమ ఆక్రందనను ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకునేలా చేయాలని కోరుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామల ప్రజలు.. ఆయా గ్రామాల పరిధిలో దీక్షలు, నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, రైతు కూలీలు రోజుకో రీతిలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తుళ్లూరులో రైతులు దీక్షా శిబిరం నుంచి స్థానిక వైఎస్ విగ్రహం వరకు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం వైఎస్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా జగన్ మనసు మార్చాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వెలగపూడిలో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకోసం ఇస్తామనడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మారే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఈ సందర్భంగా రైతులు తేల్చి చెప్పారు.
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో ఇవాళ మరో ఇద్దరు రైతు కూలీల గుండె ఆగింది. వెలగపూడికి చెందిన సలివేంద్ర సంశోను(33) గుండెపోటుతో మృతి చెందాడు. అమరావతికి మద్దతుగా గత కొన్ని రోజులుగా సంశోను ఆందోళనల్లో పాల్గొంటున్నాడని బంధువులు తెలిపారు. రాయపూడికి చెందిన మస్తాన్ అనే రైతు కూలీ ఈరోజు ఉదయం గుండె పోటుతో మృతి చెందాడు. అమరావతిపై ఆందోళనతోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీక్షా శిబిరంలో రైతులు.. మస్తాన్ మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more