ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు దీనిపై దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంపై పలు దేశాల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ లో వైరస్ విజృంభించిన పక్షంలో దాన్ని ఎలా నిలువరిస్తారన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
జనసాంద్రత అధికంగా ఉన్న ఇండియాలో కరోనా వైరస్ సోకిన పక్షంలో ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అమెరికా నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇరాన్ లో ఆరోగ్య శాఖ ఉపమంత్రికే వైరస్ సోకడం పట్లా అమెరికా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వైరస్ వ్యాప్తిని ఇరాన్ కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోందని యూఎస్ ఆరోపిస్తోంది. మహమ్మారి ఎదుర్కొనే సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంలో ఇరాన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చింది.
పలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సన్నద్ధత కొరవడిందని నిఘా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు హౌజ్ ఆఫ్ రిప్రంజెంటేటివ్స్ ఇంటెలిజెన్స్ కమిటీకి సదరు సంస్థలు సమాచారం అందించాయి. వివిధ దేశాల వైరస్ కట్టడి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో అమెరికా నిఘా సంస్థలు అక్కడి ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ వంటి సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు కమిటీలోని ఓ ప్రతినిధి తెలిపారు. అనేక పద్ధతులను అనుసరించి ఆయా దేశాల సామర్థ్యాన్ని, సన్నద్ధతను అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more