అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న ఫోర్డ్ కారు అతివేగంగా వచ్చి తెలుగువారు ప్రయాణిస్తున్న అక్యూర కారును ఢీకొన్నడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డల్లాస్ నగర సమీపంలోని ప్రిస్ కో వద్ద వెల్ వెబ్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అమెరికా కాలమానం ప్రకారం అధివారం సాయంత్రి 6.40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టి ఫోర్డ్ కారును నడిసిస్తున్న మైనర్ బాలుడ్ని అసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మరణించిన మృతుల్లో హైదరాబాద్కు చెందిన భార్యాభర్తలతో పాటు ఏపీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ గాంధీనగర్ కు చెందిన రాజా గవిని (41), దివ్య ఆవుల (34) భార్యాభర్తలు. వీరిద్దరూ టెక్సాస్ లోని ఫ్రిస్కోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచిపెట్టారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ.. మార్గమధ్యంలో తమ స్నేహితుడైన ప్రేమ్ నాథ్ రామనాథంను తమ కారులో ఎక్కించుకుని.. తమ సొంత ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి బయలుదేరారు.
ఈ క్రమంలో ఫ్రిస్కోలోని డెల్ వెబ్ వద్దనున్న కూడలి వద్ద.. ఎఫ్ఎం 423 ఇంటర్సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఎదురుగా, అతివేగంగా వస్తున్న ఓ ఫోర్టు కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రాథమిక సమాచారం మేరకు పోర్డు కారు వెళ్లే మార్గంలో ఎల్లో లైట్ వున్నా అతివేగంగా వచ్చిన ఫోర్డు కారు ఢికొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో దివ్య అవుల కారును నడిపిస్తున్నారని తెలిపారు. కాగా, ఫోర్డు కారును నడిపిస్తున్న మైనర్ బాలుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కేసు నమోదు చేసిన ప్రిస్కో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more