సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలుకుతూ సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్ హోదా’ ఇచ్చేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడింది. ఇదే సమయంలో మహిళా అధికారులకు కమాండ్ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. మహిళా ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్ పై మనం యుద్ధం గెలిచామన్న విషయాన్ని మరిచారా అంటూ ఎద్దేవా చేసింది.
ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం షాక్కు గురైంది. శారీరక పరమైన పరిమితుల కారణంగా మహిళలకు కమాండ్ హోదా ఇవ్వట్లేదని ప్రభుత్వం చెప్పింది. అంతేగాక అలాంటి కఠినమైన విధులు మహిళలు నిర్వర్తించగలరా లేదా అని అనుమానించింది. ప్రగతి గురించి మాట్లాడే ప్రభుత్వం నిజమైన వైఖరి ఇదే’ అని శివసేన విమర్శించింది. ఇలాంటి మూస ఆలోచనా ధోరణిని ప్రభుత్వం మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. మహిళ అయిన ఇందిరా గాంధీ ఈ దేశానికి ప్రధాని అయ్యారని, ఆమె నాయకత్వంలో 1971లో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం గెలిచిన విషయాన్ని గుర్తుచేసింది.
అంతేకాదు కేంద్రం చరిత్రలో వీరనారీమణులుగా నిలిచిన వారిని కూడా విస్మరించడంతో పాటు అవమానించేలా చేస్తోందని విమర్శించింది. రాణీ ఝాన్సీ లక్ష్మీభాయి, రాణి చెన్నమ్మ, రాజారామ్ మోహన్ రాయ్ సతీమణి మహారాణి తారాభాయ్, కెప్టెన్ సుబాష్ చంద్రబోస్ నిర్మించిన ఇండియన్ నేషనల్ అర్మీలో కెప్టెన్ గా వ్యవహరించిన లక్ష్మీ సెహగల్ పేర్లను కూడా ఊటంకించింది. మహిళా శౌర్యం, త్యాగం విషయంలో మహిళ, పురుషుడు అనే భేదభావం చూపించడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికింది. సాయుధ బలగాలకు మహిళ అధినాయకత్వం వహించే రోజు కూడా త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
సైన్యంలో మహిళా అధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గత సోమవారం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. శారీరక పరిమితుల కారణంగా మహిళలకు కమాండ్ హోదా ఇవ్వడం లేదన్న ప్రభుత్వ వాదనను న్యాయస్థానం తీవ్రంగా తప్పబట్టింది. ‘‘గర్భధారణ, మాతృత్వాన్ని పొందడం, పిల్లల పెంపకం, కుటుంబపరమైన బాధ్యతల నిర్వహణ వంటి కారణాల వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లోని సవాళ్లను అందుకోలేరన్న కేంద్ర ప్రభుత్వ వాదన మూస ఆలోచన ధోరణికి నిదర్శనం. ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more