టోల్ ప్లాజా వద్ద తన స్కూటర్ ను పార్క్ చేసి వెళ్లిన దిశపై పథకం వేసి మరీ అమెపై అఘాయిత్యానికి తెగబడి.. ఆపై అమెను కిరాతకంగా హతమార్చి..దహనం చేసిన దిశ ఘటన గుర్తుందా.? ఈ కేసులోని నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హత్యమార్చారు. సరిగ్గా ఇదే తరహాలో హర్యానాలోని చంఢీగడ్ లో మూత్రవిసర్జనకు వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్ కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్ కు వెళ్లారు. ఆదివారం రోజుల వారు తిరుగు పయనం అయ్యారు. బస్సులో వస్తుండగా వారికి ఇవ్వాల్సిన డబ్బు రావడంతో పానిపట్ కు చెందిన బంధువులు ఫోన్ చేసిన సమాచారం అందించారు. దీంతో బందువుల కోసం రాత్రి 11 గంటల సమయంలో కర్నల్ టోల్ప్లాజా వద్ద బస్సు దిగారు దంపతులు. వారి కోసం నిరీక్షించే సమయంలో బాధిత మహిళ(19) మూత్రవిసర్జన కోసం పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది.
ఇది గమనించిన స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళను కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. అయితే అంతకుముందు వారు తమ మొబైల్ నెంబర్లను అమె వద్ద ఇచ్చారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్నిచెప్పుకుని విలపించింది. దీంతో సోమవారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఇచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా వారు పోలీసులకు చిక్కారు. అయితే నిందితులు టోల్ ప్లాజా వద్ద చిప్స్ అమ్ముకునే మేఘరాజ్, సోనూలుగా పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు అనంతరం వారిని రిమాండ్కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more