అనాగరిక పద్దతులు, మూఢాచారాలు, సంప్రదాయాల పేరుతో గుజరాత్ లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థులపై అమానుష చర్యలకు పాల్పడిన ఘటనలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ సహా కోఆర్డినేటర్ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు ఏది మంచి, ఏది చేడు అని వివరించే కళాశాలలోనే ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 68 మంది విద్యార్థుల లోదుస్తులను విప్పించి మరీ వారు రుతుస్రావంపై పరీక్షించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దేవుడే ఆడజన్మకు ఈ వరం కల్పించాడని, ప్రకృతి సహజంగా వచ్చిన రుతుస్రావం సమయంలో తాము ఆలయాలకు ఎందుకు వెళ్లవద్దని ఓ వైపు మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న తృప్తి దేశాయ్ ఆలయాల్లోని గర్భగుడిలోకి కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. కాగా, రుతుస్రావం జరుగుతున్న విద్యార్థినులు కాలేజీ హాస్టల్ వంట గదిలోకి, అక్కడి దేవాలయాల్లోకి కూడా ప్రవేశించి సుచీ, శుభ్రం లేకుండా, మడీ, అచారాలను మంటగలుపుతున్నారన్న హాస్టల్ వార్డెన్ పిర్యాదుతో ప్రిన్సిఫల్ వారిపై అనైతిక చర్యకు పాల్పడింది.
ఏకంగా కాలేజీ హాస్టల్ లో ఉంటున్న 68 మంది విద్యార్థినులను తన గదికి పిలిచి వార్నింగ్ ఇచ్చిన ప్రధానోపాధ్యయురాలు.. వారిందరికీ ఒకరు తరువాత ఒకరుగా కాలేజీ బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ వారిచేత బలవంతంగా లోదుస్తులు విప్పించి మరీ వారి రుతుస్త్రావంపై పరీక్ష చేసింది. ఈ దారుణఘటన ప్రధాని నరేంద్రమోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ లో జరిగింది. ఆ కళాశాలలో వున్న నియమాలను ఉల్లంఘించి విద్యార్థినులు.. రుతుస్రావం జరిగే రోజుల్లో హాస్టల్ కిచెన్ వైపు, అక్కడున్న ఆలయం వైపు వచ్చారని.. తోటి విద్యార్థినులతో కలిసి కళాశాలలో కలియతిరిగారని పిర్యాదులపై ఈ చర్యలకు యాజమాన్యం పాల్పడింది.
అంతటితో ఆగని కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పోలీసులకు పిర్యాదు చేయడానికి విద్యార్థినులు ముందుకురాలేదు. ఇది మతపరమైన విషయం కాబట్టి కంప్లైంట్ ఇవ్వకూడదని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసారని కొందరు విద్యార్థినులు వ్యాఖ్యానించడం గమనార్హం.. ఈ సంఘటన గురించి బయటకు పొక్కడంతో సదరు కళాశాల యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొందరు విద్యార్థినుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు జాతీయ మహిళా కమీషన్ రంగంలోకి దిగింది. యాజమాన్యం చర్యలపూ కన్నెర్ర చేసింది. పోలీసులు చర్యలు చేపట్టాలని అదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు కాలేజీ ప్రిన్సిపాల్ రీటా రానింగా, కోఆర్డినేటర్ అనిత, ప్యూన్ నయనాలతో పాటు హాస్టల్ ఇంచార్జ్ రమీలాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులపై కూడా కాలేజీ యాజమాన్యం సహా పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కళాశాల క్రాంతిగురు శ్యాంజీ కృష్ణవర్మ కట్చ్ యూనివర్సిటీకి అనుబంధంగా వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more