ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు శాసనమండలిలో చుక్కెదురవ్వగా.. ఇక ఆంగ్ల మాధ్యమ బోధన విషయంలోనూ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంగా మార్చడంపై దాఖలైన పిటీషన్లపై ఏపీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అంగ్ల మాద్యమ బోదన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన పలు మార్గదర్శకాలకు విరుద్దంగా వున్నాయంటూ దాఖలైన పిటీషన్లను విచారించిన న్యాయస్థానం.. ఈ విషయంలో ముందుకు వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది.
తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్లం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై ముందుకెళ్తే.. ఆ ఖర్చును అధికారుల నుంచే రాబడతామని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని చెప్పింది ధర్మాసనం. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దాఖలు చేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది హైకోర్టు.
కాగా నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఆంగ్ల మాధ్యమంపై స్టే ఇస్తామని తేల్చి చెప్పింది. విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది ఏపీ సర్కారు. దీనికోసం నవంబరు 20న రాష్ట్ర ప్రభుత్వం జీవో 85ను జారీ చేసింది. అయితే దీనిని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, బీజేపి నాయకుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more