అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదన మూర్ఖపు నిర్ణయమి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది 5 కోట్ల ప్రజల ఆకాంక్షగా చెప్పుకోచ్చారు. కేవలం ఒక వర్గం నేతల ఆర్థిక, రాజకీయ లభ్ది కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారని తీవ్రంగా ఫైర్ అయ్యారు.
రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం బంగారం పండే భూములను ఇచ్చిన రైతులకు నిత్యం అండగా వుంటామని చెప్పారు. భావితరాల కోసo పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోమన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.
సీఎం వైఎస్ జగన్ అరాచకాలకు అంతులేకుండా పోయిందని, ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో జరిగే నిరసనలను అడ్డుకోవడం, ఐకాసతో పాటు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్ రెచ్చిపోతున్నారని, ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో ఎమర్జెన్సీ సమయంలో ఉన్న నిర్బంధం కన్నా అధికంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పౌర హక్కులకు భంగం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధం చేసిన తమ నేతలను వెంటనే విడిచి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more