కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. పోలిస్ స్టేషన్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో వున్న నేతలపై పిర్యాదు తీసుకోరా.? అంటూ మండిపడ్డారు. కేసు పెట్టలేదని పోలీసు అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందన వి.హెచ్ ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించారు.
మంగళవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న హనుమంతరావు సి.ఐ, ఎస్.ఐ.లతో భేటీ అయ్యారు. తను వారం రోజుల కిందట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని వి.హెచ్. పోలీసు అధికారులను నిలదీశారు. తాము న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకున్నామని, ఇందులో కేసు నమోదు చేసే అంశాలు లేవని.. అందుకే కేసు నమోదు చేయలేక పోయామని పోలీసులు సమాధానమిచ్చారు. దాంతో విహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు కొన్ని పార్టీలపై పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ.. మరికొన్ని రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన అరోపించారు.
చౌకిదార్ చోర్ అన్నందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టి.. ఎన్నికల సమయంలో బలవంతాన అడిగించుకుని క్షమాపణ చెప్పించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సెక్యూలర్ దేశమైన భారత్ తోని 130 కోట్ల మంది హిందువులేనంటూ మిగిలిన మతాలవారి మనస్సులను గాయపర్చిన ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్పై కేసు ఎందుకు పెట్టరని వీహెచ్ ప్రశ్నించారు. మోహన్ భగవత్ ప్రకటన చేసిన తరువాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దేశంలో అన్ని మతాలు సమానమని వ్యాఖ్యానించారని అన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలను నమ్మలాని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విహెచ్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ పోలీస్ స్టేషన్ నుంచి నిష్క్రమించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more