సంపన్నవర్గాలతో పాటు అధికాదాయ మధ్యతరగతి వర్గ ప్రజలకు అందుబాటులో వున్న విమానయానం సేవలు.. పండగ సీజన్ లో ప్రైవేటు బస్సు సర్వీసుల సేవలను తలపిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఒక్కటి, రెండు రోజుల పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారిని దర్శంచుకునేందుకు వస్తున్న భక్తులకు నిలువుదోపిడి చేసేస్తున్నాయి. అదేంటి అంటే.. పండగ సీజన్లో బస్సుల్లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను అధిక ధరలతో దోపిడీ చేసే పలు బస్సు సర్వీసుల మాదిరిగానే.. విమానయాన సర్వీసులు కూడా మారిపోయాయి.
ఔనా ఇలా విమానాయాస సర్వీసులు కూడా ధరలు పెంచేస్తాయా.? అంటే నిజమేనని చెప్పక తప్పదు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని పలు నగరాల నుంచి భక్తులు కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసి.. ఉత్తర ద్వార ప్రవేశంతో పాటు శ్రీనివాసుడి దర్శనాన్ని చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. దీంతో తిరుమలకు చేరువలో వున్న రేణిగుంట విమానాశ్రాయం కూడా భక్తులతో కళకళలాడుతోంది.
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ధర్శనానికి సంపన్న భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలిసిన విమానయాన సంస్థలు తమ కస్టమర్లకు చుక్కలు చూపుతున్నాయి. అదెలా అంటే సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయ మార్గంలో టికెట్టు ధర రెండు వేల రూపాయల నుంచి రూ.3500 వరకు ఉంటుంది. కానీ భక్తల రద్దీ దష్ట్యా అదివారం నాటి టికెట్ ధర ఏకంగా రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు చేరుకుంది. ఇలా వైకుంఠ ఏకాదశికి తిరుమలకు చేరకునే భక్తులను విమానయాన సంస్థలు దోపిడి చేస్తున్నాయి.
సంపన్న కుటుంబాలకు చెందినవారు వీటిని పెద్దగా పట్టించుకోకుండా టికెట్ ధరతో సంబంధం లేకుండా ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. ఎలాగైనా తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వారు టికెట్ ధర ఎంతైనా పర్వాలేదని అంటున్నా.. టికెట్లు మాత్రం అందుబాటులో లేవు. ఉదయం పూటకు మాత్రమే రెండింటిలో టిక్కెట్లు ఉన్నాయి. ఇక సర్లే అని వాటిని తీసుకుని తిరుగు ప్రయాణానికి టికెట్లు ప్రయత్నించినా అదే పరిస్థితి ఎదురవుతుంది. సోమవారం నాటికి కూడా హైదరాబాద్కు తిరుగు ప్రయాణానికి టిక్కెట్ల ధరను భారీగా పెంచాయి.
అయితే తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలను అందించే ఏకైక మార్గం.. ఆపద్కాల బాంధువుడిగా వున్న రైల్వే శాఖ.. మాత్రం భక్తులకు తాను వున్నానని అభయాన్ని అందిస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఆలస్యంగానైనా ప్రకటించింది. శనివారం సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు (07429) తిరుపతికి బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరిగి సోమవారం సాయంత్రం 6.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతూ తిరుపతి చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ ఫస్ట్క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులు ఈ రైళ్లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్ఛు వీటితో పాటు సంక్రాంతికి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more