బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై జరిగిన దాడికి తామే బాధ్యులమని అగ్రరాజ్యం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ధ్రువీకరించింది. తమ దేశాధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అదేశాలతోనే తాము ఈ చర్యలకు పాల్పడినట్టు తెలిపింది. అమెరికావాసులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్ ను చంపాలన్న అధ్యక్షుడి ఆదేశాల మేరకే ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దళాలలకు చెందిన హెలికాప్టర్లే ఈ దాడికి చేశాయని పేర్కొంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ అమెరికా జాతీయ జెండాను ట్విటర్లో ఉంచడం గమనార్హం.
ఇరాక్ లో ఉన్న తమ బలగాల్ని రక్షించుకునేందుకు ఖాసీంని చంపాలని ట్రంప్ ఆదేశించినట్లు పెంటగాన్ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకే అమెరికా సైనిక వర్గాలు స్వీయ రక్షణలో భాగంగా దాడి చేయాల్సి వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులో ఇరాన్ చేయాలనుకుంటున్న మరిన్ని దాడుల్ని నిరోధించాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరుల్ని రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పేర్కొంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు దాదాపు నాలుగు శాతం మేర పెరిగాయి.
తాజా దాడిలో ఇరాక్ తిరుగుబాటు సంస్థ పీఎంఎఫ్ డిప్యూటీ కమాండర్ అబు మహదీ అల్-ముహందిస్ సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్నకు చెందిన పలువురిని అమెరికా బలగాలు బాగ్దాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఇరాక్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతున్న నిరసనకారులు దాడి జరిపి.. అమెరికా బలగాలతో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీనిపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్.. అమెరికావాసులపై జరిపిన దాడికి ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్లో కీలక నిఘా విభాగం అయిన ఖడ్స్ ఫోర్స్కి మేజర్ జనరల్ ఖాసీం సోలెమన్ మరణించిన నేపథ్యంలో అమెరికా తమ దేశపౌరులను అప్రమత్తం చేసింది. ఇరాక్ లో వున్న తమ దేశస్థులు తక్షణం ఆ దేశాన్ని వీడి రావాలని అదేశాలు జారీచేసింది. ఇరాన్, ఇరాక్ దేశాలలో నెలకొన్న తాజా వాతావరణ నేపథ్యంలో ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలు వుంటాయన్న అనుమానంలో అగ్రరాజ్యం ఈ పిలుపునిచ్చింది. ఇక అదే సమయంలో అటు అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన రంగం షేర్లు లాభాన్ని అర్జిస్తున్నాయి. సోలేమన్ మరణంతో ఏకంగా మూడు నుంచి నాలుగు శాతం మేర ఇంధన ధరలు పెరిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more