సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి వెళ్లే ద్వారం వైకుంఠ ద్వారం. దీన్ని ఉత్తర ద్వారమని కూడా భక్తులు పిలుస్తుంటారు. పుష్యమీ మాసంలో వచ్చే శుద్ద ఏకాదశిని భక్తులు వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ పర్వదినాన అన్ని వైష్ణవాలయాల్లో సాధారణంగా భక్తులు దర్శనానికి వెళ్లే తూర్పు ద్వారాల గుండా కాకుండా భక్తులను ఉత్తర ద్వారాల నుంచి దర్శనానికి పంపిస్తుంటారు. ఉత్తర ద్వారాల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులు పోటీపడుతుంటారు.
అయితే ద్వాదశిన కేవలం ఫుణ్యక్షేత్రాల్లో మాత్రమే.. అదీనూ భక్తుల రద్దీని దృష్ట్యా మాత్రమే అనుమతిస్తారు. అప్పుడు మినహా సంవత్సరంలో మరెప్పుడూ ఆ ద్వారా దర్శనం అందుబాటులో వుండదు. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షా ఎనభై వేల మంది భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని లక్షా 70 వేల రూపాయల ఖర్చుతో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు.
ఇల వైకుంఠంలో వెలసిన కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడి దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు కూడా తమవంతు సహకారం అందించాలని సింఘాల్ విజ్ఞప్తి చేశారు. నారాయణ గిరి ఉద్యానవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ ను ఐదో తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ నెల 21, 28 తేదీల్లో దివ్యాంగులకు, 22, 29 తేదీల్లో చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సింఘాల్ తెలిపారు.
అయితే గతేడాది పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చుతూ కేవలం రెండు రోజులకే ఉత్తరద్వార దర్శనాన్ని పరిమితం చేయడంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొందని హైకోర్టులో న్యాయవాది తాళ్లపాక రాఘవన్ వేసిన వాజ్యం విచారణకు కూడా వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మహేశ్వరి, జస్టిస్ ఎం వెంకటరమనాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించిన న్యాయవాది రాఘవన్.. పలు వైష్ణవాలయాల్లో పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనానికి అనుమతిస్తారని వాదనలు వినిపించారు.
కాగా, తిరుమలలో కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించాలని ఇప్పటికే ఆగమశాస్త్ర పండితుల నుంచి కూడా సూచనలు వచ్చాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్.. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టీటీడికి ఆగమ పండితుల నుంచి ఎలాంటి సూచనలు అందలేదని తెలిపారు. అయితే ఆగమ పండితుల సూచనలు వచ్చిన క్రమంలో వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more