'వీర సావర్కర్ కిత్నే వీర్?' పేరుతో కాంగ్రెస్ సేవాదళ్ తీసుకువచ్చిన బుక్లెట్ను నిషేధించాలని వినాయక్ దామోదర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. భోపాల్లో జరుగుతున్న పదిరోజుల శిక్షణా శిబిరంలో ఈ బుక్ లెట్ ను పంచిన కాంగ్రెస్ సేవాదళ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే, వీర సావర్కర్ మధ్య 'శారీరక సంబంధం' ఉందంటూ ఆ బుక్ లెట్ లో ఓ కథనాన్ని ప్రచురించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
హిందూ మహాసభ సహ-వ్యవస్థాపకుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ కు గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేతో 'శారీరక సంబంధం' ఉందని.. గాడ్సే బ్రహ్మచర్యం తీసుకునే ముందు ఆయన తన రాజకీయ గురువైన సావర్కర్ తో శారీరక సంబంధాలు కలిగివున్నారని ఆ బుక్ లెట్ తెలిపింది. లారీ కొల్లిన్స్, డొమినిక్ లపైరే రాసిన 'ఫ్రీడం ఎట్ మిడ్ నైట్' పుస్తకంలోని 423వ పేజీని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ సమర్ధిస్తూ, సాక్ష్యాల ఆధారంగానే రచయిత ఈ రచన చేశాడని చెప్పుకోచ్చారు. సావర్కర్ 'గే' అవునా కాదా అనేది తమకు ప్రధానం కాదని కూడా పేర్కోన్నారు.
అయితే తమకు నచ్చిన విధంగా వ్యహరించే లీగల్ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. బీజేపీ హీరోలుగా అభివర్ణించిన వ్యక్తుల నిజస్వరూపం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ఒక పత్రికా ప్రకటనలో మండిపడ్డారు. 'సావర్కర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అనుచిత ఆరోపణలతో దేశంలో అరాచకవాదాన్ని ఆ పార్టీ వ్యాప్తి చేస్తోంది. కాంగ్రెస్ సేవాదళ్పై ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి' అని అన్నారు. ఐపీసీలోని సెక్షన్ 120, 500, 503, 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని, ఆ బుక్ లెట్ పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more