కేంద్ర ప్రభుత్వం పాడు సైట్లను పూర్తిగా నిషేధం విధించామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ గొప్పలు నీటిమూటలేనంటూ మనవాళ్లు అగ్రరాజ్యం అమెరికాను మించిపోయారు. అభివృద్ధి విషయంలో ఎలా వున్నా స్మార్ట్ ఫోన్లలో పాడు సైట్లను వీక్షించే విషయంలో మాత్రం మన భారతీయులు అమెరికాను వెనక్కి నెట్టేశారు. భారత్ తో స్మార్ట్ పోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూపోతోందని.. ఇక డాటా వినియోగంలోనూ రికార్డు స్థాయిని దాటిపోతున్నారని వస్తున్న వార్తల వెనుక అసలు అర్థాన్ని తాజాగా ఓ సర్వే బయటకు పెట్టింది.
నీలి చిత్రాల వీక్షకుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని అదే సర్వే బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నలుగురిలో ముగ్గురు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ మోబైల్ ఫోన్లలో పాడు సైట్లను వీక్షిస్తున్నారని తాజాగా సర్వేలో స్పష్టమైంది. భారత్ తరువాత ఈ విషయంలో అమెరికా రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్, జపాన్లు మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. 2017తో సరిపోల్చితే గడిచిన 2019వ సంవత్సరంలో పాడు సైట్లను వీక్షించేవారి సంఖ్య మూడు శాతం పెరిగిందన్న చేధు నిజాన్ని కూడా ఈ సర్వే తేల్చింది. దీంతో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది.
వివరాల్లోకి వెళితే... ప్రముఖ నీలి చిత్రాల వెబ్ సైట్ పోర్న్ హబ్ ఇటీవల వెలువరించిన తన నివేదికలో భారత్ కు అగ్రస్థానం కట్టబెట్టింది. భారత్ వీక్షకుల్లో 89 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలు వీక్షిస్తున్నారని తేల్చింది. 81 శాతం అమెరికన్లు, 79 శాతంతో బ్రెజిలియన్లు, 74 శాతంతో జపనీయులు తర్వాత మూడు స్థానాల్లో ఉన్నారని తెలిపింది. గతంలో లాప్ టాప్, పీసీలలో పాడు సైట్లను వీక్షించినవారు గత రెండేళ్లుగా అధికమంది స్మార్ట్ ఫోన్లకు బదిలీ అవుతున్నారని సర్వే నివేదిక తేల్చింది.
దీంతో డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లలో చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తేల్చింది. రహస్య వీక్షణకు స్మార్ట్ ఫోన్ కు మించిన సాధనం లేకపోవడమే ఈ పెరుగుదలకు కారణమని గుర్తించింది. ఇక భారత్ లో అత్యధిక మంది ఈ వీక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ అందుబాటులో వున్న చౌకధర డాటానే కారణంగా కూడా సర్వే తేల్చింది. భారత్ లో మొబైల్ డేటా వినియోగం నెలకు సగటున 9.8 జీబీ ఉందని, 2024 నాటికి ఇది 18 జీబీకి చేరుతుందని ఎరిక్సన్ అంచనా వేయడం చూస్తే ఈ వీక్షకుల ప్రభావం ఉందేమో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more