మూడు రాజధానుల ఫీఠముడిపై ఇవాళ మరింత క్లారిటీ రానుంది. రాజధాని అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై క్యాబినెట్ కమిటీ స్పష్టత ఇవ్వనున్న క్రమంలో అమరావతి రైతుల్లో సర్వత్రా అందోళన వ్యక్తం అవుతోంది. వరుసగా పదో రోజు అందోళనలకు దిగిన అమరావతి రైతన్నలలో.. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననని సర్వాత్రి ఉత్కంఠ నెలకొంది.
గత పది రోజులుగా కొనసాగుతున్న అమరావతి రైతన్నల అంధోళనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని రైతులు ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. వీరికి పలురాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు మద్దతు పలుకుతున్నారు. అటు మందడం, ఇటు వెలగపూడి.. సహా రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు అందోళనలు చేపట్టారు. మందడంలో రైతులు రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు వెలగపూడి వద్ద రైతుల రిలేనిరాహార దీక్ష కొనసాగుతోంది.
కాగా, ఇవాళ జరగనున్న క్యాబినెట్ భేటీ నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. మల్కాపురం, వెలగపూడి ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మందడంలోని గ్రామస్థులెవరూ బయటకు రాకుండా 144 సెక్షన్ విధించారు. మంత్రివర్గ సమావేశం దృష్ట్యా రాజధాని ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 700 మంది పోలీసులను తుళ్లూరు పరిధిలో మోహరించారు. ప్రతి గ్రామంలోనూ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మంత్రులు, సీఎం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించినట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. కాగా, అమరావతిని ఎమ్మెల్యేలు, అధికారుల హనీమూన్ స్పాట్ గా మార్చవద్దని.. ఇక్కడే సెక్రటేరియట్, హైకోర్టులను ఏర్పాటు చేయాలని నినదిస్తూ రాజధాని గ్రామాల ప్రజలు అందోళనలు చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more