security tightened at CM camp office, amid protests అమరావతి గ్రామాల్లో కొనసాగుతున్న అందోళనలు.. ఉద్రిక్తత

Farmers protest against three capitals continue in krishnayapalem

YS Jagan, Capitals, Amaravati protesters, Amaravati Bandh, !44 Section, Police forces beefedup, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

The agitation on the nave of saving Amaravati has continued on Monday. The Farmer holds protests on the Krishnayapalem village road and the people have launched a program called Vanta-Varpu cooking food on the road to mount pressure on the government to continue capital at Amaravati.

అమరావతి గ్రామాల్లో కొనసాగుతున్న అందోళనలు.. ఉద్రిక్తత

Posted: 12/23/2019 12:41 PM IST
Farmers protest against three capitals continue in krishnayapalem

ఆంధ్రప్రద్రేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం రోజురోజుకు మరింత జఠిలం అవుతోంది. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని, ఇక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లేదా జ్యూడిషియల్ క్యాపిటల్ అంటూ సెక్రటేరియట్, హైకోర్టులను తరలించడం సమంజసం కాదని.. అక్కడి రైతులు చేస్తున్న అందోళనలు క్రమంగా ఉదృతంగా మారుతున్నాయి. వరుసగా ఆరో రోజు అమరావతి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ వంటావార్పు కార్యక్రమాలతో అవరావతి వెళ్లే ప్రధాన రహదారిపై నిరసలను చేస్తున్నారు.

మూడు రాజధానులు ప్రతిపాదనను తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని.. పూర్తిస్థాయిలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. పోలీసులు 144 సెక్షన్, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నా ఏ మాత్రం వెనక్కు తగ్గని అమరావతి ప్రజలు శాంతియుతంగానే తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో కొనసాగుతున్న నిరసనల సెగ.. తాజాగా తాడేపల్లికి కూడా వ్యాపించింది. అక్కడి రైతులు కూడా అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన క్రమంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

తుళ్లూరులో ధర్నా చేసేందుకు టెంటు వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం అలుముకుంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా టెంటు వేశారని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. రోడ్డు పక్కనే వేశామని, వాహనాలకు ఆటంకం లేదని రైతులు సమాధానమిచ్చారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తంగా మారింది. అనంతరం మళ్లీ టెంటు వేసి స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా, తుళ్లూరులో పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌ ప్రకటించాయి. వందలాది మంది విద్యార్థులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. తమ భవిష్యత్‌ను నాశనం చేయవద్దంటూ నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు మంగళగిరి మండలం నిడమర్రులోనూ రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. అటు మందడంలోనూ రైతులు నిరసనల్లో భాగంగా అర్థనగ్న ప్రధర్శనలు చేస్తున్నారు. అరగుండు, అర మీసంతో బిక్షం ఎత్తుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రైతులంతా రోడ్డుపై బైఠాయించడంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపైనే పశువులను కట్టేసి రైతులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం దిగివచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles