జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీ నేతలు తక్షణం క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాను కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో భాగంగా 12 గంటల పాటు దీక్ష చేయగా, అదే సమయంలో అదును చూసి కొందరు అబద్దాలను నిజాలుగా వక్రీకరించి.. తప్పుడు వార్తలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విసృత్తంగా ప్రచారం చేశారని.. ఇవి తొలుత వచ్చింది వైసీపీ నేతలకు చెందిన పత్రికలలోనేనని గుర్తించామని, అందుకని వారు రాపాకకు క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు.
పవన్ దీక్ష చేపట్టిన అదే సమయంలో అసెంబ్లీలో జగన్ సర్కారు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతుండటాన్ని రాపాక వరప్రసాద్ సమర్థించారు. ఇదే అదునుగా చేసుకుని క్షణాల్లో తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేశారు. అయితే దీనిలో కొంత వాస్తవం వుంటే.. దానికి చెంతాడంత కల్పితాన్ని కలగలపి.. మంచి స్టోరీని అల్లేశారు. పార్టీ మారనని ఆయన చెప్పినప్పటికీ.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. పవన్ కల్యాణ్కు, తనకు మధ్య గ్యాప్ ఉందన్నారు. ఇంతవరకు కరెక్టే కానీ దీన్ని అసరాగా చేసుకుని ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది.
ఇక ఫేక్ న్యూస్ ఏంటంటే.. రాపాక వరప్రసాద్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక దీనికి రాపాక కూడా ఘాటుగా స్పందించారని ప్రచారం చేశారు. ‘‘నాకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి? నేను గెలిచిన ఎమ్మెల్యేను.. వాళ్లు ఓడిపోయిన వారు. ఇది మరీ విచిత్రంగా ఉంది.. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉంది అంటే నాకు మాత్రమే ఉంది. జనసేన పార్టీ వల్ల, ఆ కార్యకర్తలు వల్ల నేను గెలవలేదు.. నేను ఎవరి భిక్షతో ఎమ్మెల్యే కాలేదు.. నా సొంత శక్తి తో గెలిచాను తప్ప నాకు ఎవరి భిక్ష అవసరం లేద’’ని రాపాక అన్నట్టుగా వార్త వైరల్ అయ్యింది.
ఈ విషయం దీక్షలో వున్న పవన్ కల్యాణ్ కు నిన్న తెలియలేదు. అయితే దీక్ష విరమించిన తరువాత ఆయన తన పనిలో తానుండగా, ఇవాళ ఆయన దృష్టికి ఈ ఫేక్ న్యూస్ వచ్చింది. అంతే తాను రాపాకకు షోకాజ్ నోటీసు ఇచ్చానని తప్పుడు ప్రచారం జరుగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ మద్దతుదారులు జనసేనపై దుష్ప్రచారం ఆపాలని ఆయన హితవు పలికారు. వైసీపీ సంబంధిత సైట్లో రావడం చూస్తుంటే.. ఎవరు చేయించారో అర్థం అవుతోందన్నారు. రాపాకను అరెస్ట్ చేసి బెయిల్ రానీయకుండా వైసీపీ నాయకులు ప్రయత్నించినప్పుడు.. స్వయంగా నేనే రంగంలోకి దిగడానికి వచ్చినప్పుడు వారు వెనక్కి తగ్గారన్నారు. తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు రాపాక గారికి క్షమాపణలు చెప్పాలన్నారు.
YCP supporters should stop spreading lies and hate messages and they should apologise to Sri Rapaka Vara Prasad garu. pic.twitter.com/ERjEce20wx
— Pawan Kalyan (@PawanKalyan) December 13, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more