అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అరుదైన సేవలు అందించేందుకు తిరుమల అర్చకులు సిద్దమయ్యారు. నెల రోజుల పాటు ఆపదమొక్కుల వాడిని మేలుకొలుపు విషయంలో సుప్రభాతానికి స్వస్తిపలకునున్నారు. అందుకు బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. ధనుర్మాసంలో ఈ విధంగా మేల్కొలుపు జరపాలని నిర్ణయించుకున్న అర్చకులు అందుకు టీటీడీ బోర్డు అనుమతిని కూడా పోందారు. దీంతో ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం కొసాగనుంది.
నిత్యం సుప్రభాత సేవతో మేల్కొనే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడు.. ధనుర్మాసంలో నెలరోజుల పాటు తిరుప్పావై పఠనంతో నిద్రలేవనున్నాడు. ఈ నెలరోజుల పాటు శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన పాసురాలుతో మేల్కొలుపు జరుగుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాశురాలనే గోదాదేవి పాశురాలు అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతి రోజూ ఒక్కో పాశురాన్ని సుప్రభాతంకు బదులుగా పఠిస్తు స్వామి వారిని మేల్కోపనున్నారు అర్చకభగవానులు.
ధనుర్మాసం నెలరోజులు ఈ విధంగా గోదాదేవి పాసురాలుతో స్వామివారిని మేల్కోలుపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక ఈనెల రోజుల పాటు స్వామి వారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసిదళాల బదులుగా బిల్వపత్రాలతో నిర్వహిస్తారు. మరో వైపు స్వామి వారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు జరిగే మోహినీ అవతారం సందర్భంగా పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకతో పాటు, గరుడ సేవలో అలంకరించేందుకు తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు.
జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్దరిస్తారు. దేవతలకు 6 నెలలు కాలం పగలుగా మరో 6 నెలలు కాలం రాత్రిగా పరిగణిస్తారు. ఇక ధనుర్మాసం నెల దేవతలకు బ్రహ్మముహుర్తంగా పరిగణిస్తారు. ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా ఉంటారనీ....ఆ వేళలో భక్తులు దేవతలను పూజిస్తే సులభంగా ప్రశన్నమవుతారన్నది భక్తుల విశ్వాసం. మరో వైపు శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం నెలలో వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తారు. ఏడాదికి 2రోజులు పాటు తెరిచి వుంచే వైకుంఠ ద్వారా భక్తులకు దర్శనం లభించేది ధనుర్మాసం నెలలోనే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more