అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. న్యూజెర్సీలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలోని హడ్ సన్ కౌంటీ నగరవాసులందరినీ భయాందోళనకు గురిచేసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు, అగంతకులు పారిపోయేముందు వారిని అడ్డుకునేందుకు యత్నించిన ఓ పోలీసు ఉన్నతాధికారిని కూడా వీరమరణం పోందారు. కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు, పౌరుడు గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో న్యూజెర్సీలోని జెర్సీ సిటీకి ట్రక్కులో నల్లని దుస్తులతో వచ్చిన ఇద్దరు అగంతకులు.. అధునాతన ఫై పవర్డ్ రైఫిళ్లతో ఒక్కసారిగా జెర్సీ సిటీలోని హడ్ సన్ కౌంటీ సిటీలో సైడ్ వాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న బాటసారులపై కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతుందో తెలియని స్థానికులు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రయత్నించారు.
ఇంతలో దుండగులు వారిపై కూడా కాల్పులుకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. పోలీసులకు, దుండగులకు మధ్య నాలుగు గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. వందల రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అయితే చివరకు అగంతకులు బేవ్యూస్ సిమెంట్రీ నుంచి దొంగలించిన యు హౌల్ వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే వారిని వెంబడించిన పోలీసులకు కిలోమీటరున్నర దూరంలోని ఓ కోషన్ సూపర్ మార్కెట్ లో దుండగులు నక్కారని సమాచారం అందింది.
ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు చాకచక్యంగా సూపర్ మార్కెట్లోకి వెళ్లాగా ఇద్దరు అగంతకులతో పాటు మరో ముగ్గురు కూడా నిర్జీవంగా పడివున్నారు. స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటనలో అగంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి జోసెఫ్ సీల్స్ వీరమరణం పోందారు. కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే అగంతకులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారన్న విషయం పోలీసులకు అంతుచిక్కడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more