దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో నిందితులందరూ పోలీసుల ఎన్ కౌంటర్ లో హత్యమయ్యారన్న వార్తలు విన్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసు చర్యలను స్వాగతించారు. పోలీసుల ఎన్ కౌంటర్లో తమ కూతురిని అపహరించి.. సామూహిక హత్యాచారం చేసి.. దహనం చేసిన బాధ ఎప్పటికీ తమ గుండెల నుంచి వెళ్లిపోదని కన్నిటి పర్యంతమైన తల్లిదండ్రులు.. పోలీసుల చర్యలను స్వాగతించారు. తమ కూతురిని నిందితులు ఎక్కడైతే దహణం చేశారో సరిగ్గా అక్కడే వారందరూ పోలీసులు వారిని తూటాలతో మట్టుబెట్టడంతో తమ బిడ్డకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.
తమ బిడ్డ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేసిన దిశ తల్లిదండ్రులు.. నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. నిజానికి నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని, అయితే, అంతకుమించిన న్యాయం జరిగిందని అన్నారు. నిర్భయ ఘటనలో వారి తల్లిదండ్రులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని దీంతో తమకు న్యాయం జరిగేందుకు ఎన్నేళ్లు పడుతుందోనని అందోళన చెందామన్నారు.
సమాజంలోని ఏ ఆమ్మాయికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అమె తెలిపారు. న్యాయం ఎప్పుడు జరుగుతుందోనని అన్నుకున్నామని, అయితే ఇలా తమ బిడ్డకు ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చుతారని తాను అనుకోలేదని తెలిపారు. ఇక దిశ సోదరి కూడా ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల ఇకపై ఈ ఘటనలు పునరావృతం కావని తాము భావిస్తున్నట్లు పేర్కోన్నారు. ఆమ్మాయిల రక్షణ విషయంలో చట్టాల్లో కూడా సమూల మార్పులు తీసుకురావాలని అమె పేర్కోన్నారు.
మహిళలకు రక్షణగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కూడా అవగాహన కల్పించాలని దిశ సోదరి అభిప్రాయపడ్డారు. ఇక భద్రత విషయంలో మహిళలు కూడా వారి జాగ్రత్త పట్ల వారు అప్రమత్తంగా వుండాలని అమె సూచించారు. అయితే తమ బిడ్డ దారుణ మరణం పట్ల తమకు ఉపశమనం లభించిందని కానీ దీంతో తమకు దూరమైన పాప తిరిగి రాదని దిశ తండ్రి అవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా అగంతకులకు గుండెళ్లో ఇది భయాన్ని రేకెత్తిస్తుందని అ్నారు. కాగా, నిందితుల మృతదేహాలను ఈ తెల్లవారుజామున నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more