రాజస్థాన్ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదరెదురుగా వస్తున్న వాహనాలు అదుపుతప్పి ఒకదాన్ని ఒక్కటి పరస్పరం ఢీకొన్న ఘటనతో 11వ నెంబరు జాతీయ రహదారి నెత్తురోడింది. రాజస్థాన్ లోని బికనేర్ జిల్లా శ్రీదంగర్ గఢ్ సమీపంలోని 11వ నెంబర్ జాతీయరహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే 10 మంది మృతిచెందగా, మరో నాలుగురు అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. కాగా మరో 18 మందికి తీవ్రగాయాలయ్యారు. క్షతగాత్రుల్లో మరికొందిరి పరిస్థితి కూడా విషమంగానే వుందని వైద్యులు తెలిపారు.
ప్రమాదఘటనా జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించేందుకు బరిలోకి దిగారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు కూడా సహాయకచర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సులో వున్న ప్రయాణికులు బయటకు రాలేక అందులోనే చిక్కుకున్నారు.
జేసీబిలను తెప్పించిన పోలీసు అధికారులు లారీ నుంచి బస్సును వేరు చేసి.. ఆ తరువాత బస్సులో చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆర్థనాధాలతో ఆ ప్రాంతంలో విషాధం అలుముకుంది. కాగా, ఈ దుర్ఘటనకు అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. లారీ అతివేగంగా వచ్చి బస్సును బలంగా ఢీకొనిందని, దీంతో బస్సు ముందు భాగం నుజ్జనుజ్జయ్యిందని తద్వారా బస్సు ప్రమాదంలో 14 మంది అసువులు బాసారని పోలీసులు తెలిపారు. మరికోందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి, అందులో చిక్కుకున్నారు. జేసీబి, క్రేన్ సాయంతో బస్సును, లారీని వేరుచేయడానికి పోలీసులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమించారు. దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more