టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు కావడంతో పాటు ఆయనపై మరో 18 కేసులు కూడా నమోదైన నేపథ్యంలో అన్ని కేసుల సంబంధించి ఆయన ఇవాళ బెయిలు మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయన దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కక్షపూరితంగానే కేసులు పెట్టారని అరోపించారు.
తాను ఏ దళితుడి ఆస్తి కోసం ఆశపడలేదని, ఇతరులకు సాయం చేసేందుకు తాను సొంత ఆస్తులు తగలేసుకునేవాడ్నే తప్ప, ఇతరుల ఆస్తులు తనకు అవసరంలేదని అన్నారు. 18 కేసులు పెట్టి ఎవర్ని వేధించాలనుకుంటున్నారు? అంటూ చింతమనేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క కేసులో తాను తప్పు చేసినట్టు తేలినా, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై నేరుగా విమర్శలను ఎక్కుపెట్టారు. "గతంలో నువ్వు వేదనకు గురయ్యావు కదా అని ఇతరులను కూడా అలాగే వేధించడం సరికాదని అన్నారు.
‘‘నీకు 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అహంభావం, పొగరుతో వ్యవహరించడం అవసరమా? సెక్షన్ 30 అమలు చేసి.. నా అభిమానులను ఎందుకు కొట్టారు? ఏం నష్టం జరుగుతుందని విగ్రహాలకు దండ వేయొద్దన్నారు?" అంటూ ప్రశ్నించారు. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడం అంటే, రైతు భరోసా అమలు చేయడం, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వడం, ఆరోగ్య శ్రీ అమలు చేయడం మాత్రమే కాదు, శాంతిభద్రతలను అమలు చేసి, ఇతరుల మనసులు గాయపర్చకుండా ఉన్నప్పుడే మంచి సీఎం అనిపించుకుంటారని హితవు పలికారు. తాను దళిత వ్యతిరేకి అని తన నియోజకవర్గంలోని ఏక్కడ నిరూపించినా, అక్కడే తాను దోషినని ఒప్పుకుంటానని స్పష్టం చేశారు.
అప్పటి ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంపై ఇప్పటికీ తన గురించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో చంద్రబాబు నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ తనపై సెక్షన్ 350 కింద కేసు నమోదు చేయించారని తెలిపారు. ఇవాళ సీఎం కార్యదర్శిగా ఉన్న సాల్మన్ అరోకియ రాజ్ ఈ విషయంలో నిజాలు వెల్లడించాలని కోరారు. తాను తప్పుచేశానని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. వనజాక్షి వ్యవహారాన్ని జేసీ శర్మ కమిటీ విచారణ జరిపిందని అందులో సల్మాన్ అరోకియ రాజ్ కూడా సభ్యుడని చింతమనేని వెల్లడించారు. ఎమ్మార్వో వనజాక్షిపై తాను ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, దాడి చేయలేదని, ఆమెను దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చెప్పానని తెలిపారు. ఈ వ్యవహారంలో తనను దుశ్శాసనుడిని చేస్తున్నారని అవేదన చెందారు. వైసీపీ ప్రభుత్వమే వనజాక్షి వ్యవహారాన్ని మొదటి నుంచి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఉన్న కేసులకు ఒకవేళ శిక్షపడితే ఆర్నెల్ల వరకు పడుతుందేమోనని, కానీ జగన్ పై ఎన్నో చార్జిషీట్లు ఉన్నాయని, శిక్ష పడితే ఆయనకు ఉండదా బాధ? అంటూ వ్యాఖ్యానించారు. ఇరత పార్టీల నేతలు మీలాంటి మనషులు కారా.? వారికి మీలా హృదయాలు వుండవా.? అని ప్రశ్నించారు. ఆ రోజున నిన్ను జైల్లో వేస్తే నీ తల్లి, చెల్లి, కార్యకర్తలు, అభిమానులు ఎలా తల్లడిల్లిపోయారు? ఎంత చెట్టుకు అంత గాలి! నీది పెద్దచెట్టు కాబట్టి అంతగాలి, నాకుండే గాలి నాకుంటుంది కదా!' అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో స్పందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more