తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో మరో రికార్డును అందుకుంది. తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు చేపట్టిన సమ్మెగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కొత్త రికార్డును నమోదు చేసుకుంది. నేటితో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఏకంగా 43 రోజులకు చేరకున్న తరుణంలో ఈ రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మె మాత్రమే 42 రోజుల పాటు సాగిన విషయం తెలిసిందే. ఆ రికార్డలను టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె అధిగమించడంతో సకల జనుల సమ్మెను బద్దలుకోట్టిన ఆర్టీసీ కార్మికులు నూతన రికార్డును అందుకున్నారు.
అయితే గతంలో పలు పర్యాయాలు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఉపక్రమించారు. సమ్మెను చేపట్టారు. అయితే ఎప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ స్థాయికి చేరలేదు. 2001లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టగా 24 రోజుల పాటు కొనసాగింది. ఇక సకల జనుల సమ్మెలో కూడా ఆర్టీసీ కేవలం 17 రోజులు మాత్రమే సమ్మెను చేపట్టారు. కానీ తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏకంగా రికార్డు స్థాయిని అందుకున్న సుదీర్ఘ సమ్మెగా రికార్డులకు ఎక్కడం గర్హనీయం. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలు, మరోవైపు మానసిక అందోళనలతో గుండెపోటుకు గురైన మరణాలు నమోదవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను కనికరించడం లేదు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా క్రితంరోజు జరిగిన ఆందోళనల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్మికులు గేటు వద్దే బైఠాయించి ధర్నాకు దిగారు. అలాగే, నిజామాబాద్, నిర్మల్, భైంసా డిపోల్లోకి వెళ్లిన కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నేతల ‘బస్ రోకో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ 144 సెక్షన్ ను విధించాలని ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more