ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత సున్నితమైన అయోధ్యలో వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. బాబ్రీ మసీదుకు అధీనంలో వున్న వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిలో ఇక రామమందిర నిర్మాణం జరుపుకోవచ్చునని సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంపై కేంద్ర ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది.
అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. ఆ 2.77 ఎకరాల స్థలాన్ని సుప్రీంకోర్టు.. రామమందిర నిర్మాణానికి అప్పగించింది. మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని చెప్పింది. మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం, విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. అదేశించింది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవని స్పష్టం చేసింది.
1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. వివాదాస్పద స్థలంపై హక్కులు, మత సామరస్యం, శాంతి భద్రతలకు లోబడి ఉంటాయని పేర్కొంది. అయితే ఈ భూమికి బదులుగా బాబ్రి మసీదుకు ఐదు ఎకరాల స్థలాన్ని అయోద్యలోని మరో ప్రాంతంలో అప్పగించాలని ఈ బాధ్యత కూడా ట్రస్టుదేనని న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు:
* వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామమందిరానికే
* సున్నీ బోర్డుకు ఐదు ఎకరాల అనువైన స్థలం కేటాయించాలి.
* 1993లో కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమి నుంచి ఐదు ఎకరాలు కేటాయింపు
* భూమి ఎక్కడ కేటాయించాలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలి.
* వివాదాస్పదమైన స్థలాన్ని పంచే ప్రసక్తే లేదు.
* వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది
134 సంవత్సరాలుగా వివాదంలో ఉంది రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more