మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నెల 9 శనివారంతో గత ప్రభుత్వ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నావిస్ ఆపధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడమా.? లేక రాష్ట్రపతి పాలన విధించడమా.? అన్న విషయామై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కాగా బీజేపి ఎన్నికలకు ముందు తమకిచచిన మాటకు కట్టుబడి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవడానికి సిద్దపడితేనే తమతో చర్చలకు సంప్రదించాలని శివసేన తెగేసి చెప్పడంతో.. పీఠముడి చిక్కువీడటం లేదు. దీంతో నిన్నటి వరకు మిత్రపక్షంగా ప్రజల్లోకి వెళ్లిన పార్టీలు నేడు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం ప్రజల్ని, ప్రజాతీర్పును అగౌరపరచడమేనని అభిప్రాయపడ్డారు. అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో బీజేపి అధికార దుర్వినియోగం చెయ్యొద్దన్నారు. పదవీకాలం ముగియనుండటంతో ఫఢ్నావీస్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపిపైనే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత ఉందన్నారు. ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి కావాలంటే బలనిరూపణకు నెలరోజుల సమయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారిక పత్రిక సామ్నాలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి బీజేపియే కారణమని విమర్శించింది.
బీజేపి ట్రబుల్ షూటర్ గా మారిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. మహాసంక్షోభాన్ని తనదైనశైలిలో పరిష్కరించేందుకు రంగంలోకి దిగనున్నారు. ఇవాళ ఆయన ముంబైకి చేరుకోనున్నారు. ఈ విషయమై క్రితం రోజున అర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ తో ఇప్పటికే సమావేశమైన ఆయన.. ఇవాళ శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేతో భేటీకానున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీనిపై స్పందించిన సంజయ్ రౌత్.. శివసేనకు సీఎం పదవి ఇచ్చే హామితో రాయభారం చేస్తే తమకు అభ్యంతరం లేదని, అలాకానీ పక్షంలో ఆయన పర్యటనను శివసేన సాధారణ పర్యటనగానే భావిస్తుందని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more