ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రంలో తమ ఉనికిని చాటాలని భావిస్తాయి. అందుకు అనుగూణంగా తమ అధిపత్యం స్పష్టంగా కనబడేలా నిర్ణయాలు తీసుకుంటాయి. రాష్ట్రంలోని అన్నిరంగాల్లో ఇది కామన్. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటీవల ఎన్నికలలో దారుణ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో జగన్ సర్కార్ కూడా తమ అధిపత్యాన్ని అన్ని చోట్ల చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు సర్కార్ గతంలో పదవి విరమణ పొందిన టీటీడీ ఆలయ అర్చకుడు డాలర్ శేషాద్రిని తిరిగి నియమించారు. దీంతో ఆయన ఇప్పుడు మరోమారు టార్గెట్ అయ్యారు. దీంతో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన ఉద్యోగులందరినీ పంపేయాలని నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రభుత్వం ఇందుకుగాను జీవో 2323ను తీసుకువచ్చినా.. ప్రస్తుతం మాత్రం దీనిపై వెనక్కు తగ్గక తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ జీవో మేరకు.. పన్నెండేళ్ల కిందట రిటైరై… ఇప్పటికీ చక్రం తిప్పుతున్న డాలర్ శేషాద్రిని కూడా తొలగించడానికి టీటీడీ అధికారులు ఫైల్ ను సిద్ధం చేశారు. ఆయనను తొలగించాల్సిందేనని టీటీడీ అధికారులపై ఓ వర్గం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసింది. ముఖ్యంగా టీటీడీలోకి రావాలనుకుంటున్న మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు మద్దతుగా ఉండే వర్గం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపైనే ఒత్తిడి పెట్టిందని ప్రచారం జరిగింది.
ప్రభుత్వం కూడా ఇక తొలగించినట్లేనని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు వచ్చిన సూచనల ప్రకారమే.. టీటీడీ అధికారులు ఫైల్ను సిద్ధం చేశారు. రాత్రికి.. వందమందికిపైగా అలా రిటైరై మరీ ఉద్యోగంలో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. అందులో డాలర్ శేషాద్రి పేరు లేదు. 2006లో రిటైర్ అయినా ఇప్పటికీ పొడిగింపు తెచ్చుకుంటూ ఉన్నారు. గతంలో ఆయన పొడిగింపుపై కోర్టు కేసులు నమోదయ్యాయి. ఓ సారి డాలర్ శేషాద్రి నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై డాలర్ శేషాద్రి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు డాలర్ శేషాద్రికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆయన టీటీడీలో కొనసాగుతున్నారు.
దీంతో డాలర్ శేషాద్రికి ఉన్న పలుకుబడి అర్థం చేసుకోవచ్చంటున్నారు. శ్రీవారికి జరిగే సేవల విషయంలో.. ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఆలయం గురించి.. శ్రీవారి పూజల గురించి.. ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని.. టీటీడీ వర్గాలే చెబుతూంటాయి. ఆయన రాకపోతే… పూజాకైంకర్యాలు చేసే వారిలో చాలా మందికి కాళ్లూ చేతులూ ఆడవు. బ్రహ్మోత్సవాలు వ్యవహారాలు మొత్తం ఆయనే దగ్గరుండి చేస్తారు. ఆయన సేవలు ఆయన కోరుకున్నంత కాలం.. కొనసాగుతాయని.. తాజా పరిణామాలే నిరూపిస్తున్నాయి. కాగా ఉద్వాసనకు గురైన వారి పూర్తి వివరాలు నేడు వెల్లడికానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more