ఆశ్వయుజ మాసంతో పండుగ వాతావరణం అలుముకునే తెలుగురాష్ట్రాల్లో.. కార్తీకం రాకతో ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఇటు శైవక్షేత్రాలతో పాటు అటు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఆలయం చూసినా.. పుణ్యతీర్థాలు సందర్శించినా, ఫుణ్యక్షేత్రాలు వెళ్లినా హరినామస్మరణ మార్మోగిపోతుంది. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన మాసాల్లో కార్తీక మాసం చెప్పుకోదగినది. హరహరులిద్దరికీ ఈ మాసంలో ప్రత్యెక పూజాదికాలు నిర్వహిస్తారు. భక్త జనకోటి ఈ పూజాదికాల్లో పాల్గొని తదాత్మ్యత చెందుతారు.
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఫుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తుంటారు. అయితే వారికోసం ఏపీఎస్ అర్టీసీ కూడా ఓ అడుగుముందుకేసీ భక్తజనకోటిని పంచారామ క్షేత్రాలతో పాటు త్రిలింగ దర్శనాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఏపీఎస్ ఆర్టీసీ భక్తులకు శైవక్షేత్రాల దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు ఐదు పంచారామాల్లోని వెలసిన శివుని దర్శనం చేసుకోనేలా ప్యాకేజీ ప్రకటించింది. కృష్ణా రీజియన్ పరిధిలోని నవంబర్ 2వ తేదీ నుంచి 13 రోజుల పాటు భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు తిప్పునున్నారు.
ఐదు పంచారామాలకు బస్సులు
అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని పంచా రామాల శైవక్షేత్రాల్లో వెలసిన శివుని దర్శనం చేసుకొనేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మాసంలోని ప్రతి శనివారం, ఆదివారం, సోమవారాల్లో పాటు ముఖ్యమైన రోజుల్లో ఈసదుపాయం కలిగేవిధంగా నవంబర్ 2,3,4,9,10, 11, 16,17,18,23,24,25 తేదీలు నిర్ధారించారు. ఈమేరకు విజయవాడ నుంచి ఆటోనగర్ టెర్మినల్, పండిట్నెహ్రూ బస్టాండ్ నుంచి ఉదయం 3 నుంచి 4 గంటల వ్యవధిలో బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ సర్వీసులు నడుపుతున్నట్లు జయరావు తెలిపారు.
టికెట్ రిజర్వేషన్ ఇలా:
ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ముందుగా ఆర్టీసీ బస్ స్టేషన్ లో, ఆథరైజ్డ్ టిక్కెట్ బుకింగ్ సెంటర్లలో రిజర్వేషన్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి పంచారామాలలోని శైవక్షేత్రాలకు సూపర్లగ్జరీ టిక్కెట్ పెద్దలకు రూ.880 , పిల్లలకు రూ.660 వరకు నిర్ణయించారు. అలాగే అల్ట్రా డీలక్స్లో పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.630 వరకు చెల్లించాల్సి ఉందని ఆర్ఎం జి.నాగేంద్రప్రసాద్ తెలిపారు.
త్రిలింగ దర్శిని
యాగంటిలో కొలువైఉన్న శ్రీఉమామహేశ్వర స్వామిని దర్శనం, శ్రీశైలంలోని శ్రీమల్లిఖార్జున స్వామి వారి, వాటితోపాటు మహానందిలోని స్వామి వారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేశారు. సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయగా పెద్దలకు రూ.1430, పిల్లలకు రూ.1080 కేటాయించారు. త్రిలింగదర్శిని కోసం ఏర్పాటు చేసిన సర్వీసులు శనివారం రాత్రి గం.8.00 బయల్దేరి తిరిగి సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్కు చేరుతాయి. మరింత సమచారం కోసం ఫోన్ నెంబరులో 8074298487 సంప్రదించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more