వన్ సైడ్ లవ్ చేస్తూ.. తన ప్రేమను ప్రపోజ్ చేయగానే లవర్ తిరస్కరించిందని, ప్రేమోన్మాదులుగా మారిపోయే బాయ్ ఫ్రెండ్లు అమ్మాయిలపై పలు విధాలుగా దాడులకు పాల్పడుతున్న ఘటనలను మనం చూస్తూనే వున్నాం. అయితే ప్రేమ్మోనాదుల దాడి బలైయ్యే అమ్మాయిల్లో కొందరు జీవన్మరణ పోరాటంలో విజయం సాధించిగా.. మరికోందరు మాత్రం మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిన ఘటనలు కూడా అనేకం.
కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. యాసిడ్ దాడులు, ప్రేమోన్మాదులుగా మారడం యువకులకు మాత్రమే పరిమితం కాదని.. తాము కూడా అలాంటి పనులకు ఉపక్రమించగలమని ఈ యువతి ఏకంగా నేరానికి పాల్పడింది. పందొమ్మిది సంవత్సరాల యువతి తాను ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోలేదని నిరాహార దీక్షలు, నిరసనలు చేయలేదు. తన సహనాన్ని, ఓపికకు ఫుల్ స్టాప్ పెట్టిన యువతి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని యువకుడిపై యాసిడ్ తో దాడి చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘడ్ ప్రాంతానికి చెందిన జీవన్ఘర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖవార్సీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేర యాసిడ్ దాడిలో కేసు ఫైల్ అయింది. పోలీసులకు బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా బాలిక తన కొడుకుతో ప్రేమలో ఉంది. నెల రోజులుగా వారిద్దరి మధ్య మాటల్లేవు. దానికి కారణం అడిగితే రోజూ ఫోన్ చేసి పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తీసుకువచ్చిందని కొడుకు చెప్పాడట.
దీని గురించి కొడుకుతో మాట్లాడి ఎప్పటినుంచి మాట్లాడట్లేదనే వివరాలు అడిగింది. అదే రోజే ఇంటి దగ్గర్లోని షాప్ వద్ద నిల్చొన్న తన కొడుకుపై యాసిడ్తో దాడి జరిగింది. అంతేకాకుండా పెళ్లి చేసుకోకపోతే వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానంటూ ఆ యువతి బెదిరించినట్లు ఆమె వివరించింది. బాధితుడికి చికిత్స అందిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ డాక్టర్ ఎస్ఎస్ జైదీ మాట్లాడుతూ.. దాడివల్ల యువకుని కన్ను పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. చికిత్స ఇస్తున్నామని త్వరలోనే కోలుకుంటాడని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more