యావత్ దేశ ప్రజలు విస్మయానికి గురయ్యే నిర్ణయాన్ని కేంద్రంలో బిజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకోబోతోందా.? అంటే ఔనన్న సంకేతాలే వినిపిస్తున్నాయి. దేశప్రజలు అటు చలికి గజగజలాడుతూ కూడా రాత్రింబవళ్లు క్యూలైన్లలో నిలబడి మరీ డబ్బులు విత్ డ్రా చేసుకున్న ఆ భాదకరమైన రోజులు గుర్తున్నాయా.? 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్లను రద్దు నిర్ణయం చేసిన తర్వాత అప్పటివరకు చెలామణిలో వున్న రూ.1000, రూ.500లను తొలగించారు.
అయితే పెద్ద నోట్ల రద్దు పేరుతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హాస్యాస్పందంగా మారింది. కాగా, ప్రజలను ఏటీయం కేంద్రాల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చోబెట్టి వారి కష్టాలకు వారిని వదిలేసి.. తమ కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన రూ.2 వేల కరెన్సీ నోటుపై కానీ రూ.500 కరెన్సీ నోటుపై కానీ ఎలాంటి విమర్శలు రానీయకుండా చూసుకుందన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే వీటిని పట్టించుకునే స్థితిలో అప్పటి భారతీయ ప్రజలు లేకపోవడంతో.. ప్రభుత్వం చెలామణిలోకి తీసుకువచ్చిన రూ.2000 చిల్లర దొరికతే చాలునని ప్రజలు భావించారు. ఆ సమయంలో రూ.2వేల నోటుకు చిల్లర కూడా పెద్ద కష్టంగానే మారింది.
అయితే ఇప్పుడా విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారేగా.? భారత కెరెన్సీలోకి అడుగుపెట్టిన మూడేళ్లు కావస్తున్న ఈ అత్యంత పెద్ద నోటుకు ఇక కాలం చెల్లినట్లే అగుపిస్తోంది. తాజా పరిస్థితులు చూస్తే మాత్రం రూ.2 వేల నోటు కూడా బంద్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికీ ఈ నోటు సామాన్యల మనీపర్సుల నుంచి వెళ్లి.. ధనవంతుల ఉక్కు ఖాజాల్లో స్థిరపడిందని కూడా సమాచారం.
ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రూ.2 వేల నోటును నిలిపివేసింది. అంటే.. ఇక, ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2 వేల నోటు రాదని స్పష్టం అవుతోంది. అయితే ఈ బ్యాంకు నిర్ణయాలనే పలు ప్రైవేటు బ్యాంకులు కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతున్న తరుణంలో అవి కూడా ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలా మెజార్టీ బ్యాంకులు నిర్ణయాలను మైనారిటీ బ్యాంకులు కూడా ఫాలో అవ్వడం కామన్. ఫలితంగా దేశంలో ఎక్కడా ఏ ఏటీయంలో నుంచి కూడా రూ.2వేల నోటు రాకకు త్వరలోనే చెక్ పడనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే దాదాపు అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లో రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్టు సమాచారం. అంతేకాదు.. త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.. కేవలం రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఇక ఎస్బీఐ ఏటీఎంల ద్వారా పొందే వీలుంటుందన్నమాట. మరోవైపు ఏటీఎంల్లో చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండడంతో.. ఏటీఎంల్లో ఫ్రీ లావాదేవీల పరిమితిని పెంచే యోచనలో కూడా బ్యాంకు ఉన్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more