తమిళనాడు సహా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చోరి కేసులో తమిళనాడు పోలీసులు పురోగతి సాధించారు. తిరుచ్చిలోని లలితా జ్యువెలరీ షోరూమ్లో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఓ దొంగను పట్టుకున్నారు. దొంగతనం జరిగిన వారం రోజుల వ్వవధిలోనే ఓ దోంగ చిక్కడం పోలీసుల పనితీరుకు దర్పణం పడుతోంది. ఇద్దరి దొంగలు ఈ చోరి చేసినట్లు సిసిటీవీ కెమెరాలో చిక్కడంతో మరో దోంగతో పాటు అతని అనుచరుల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తమకు చిక్కిన దొంగ నుంచి 4.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లలితా జ్యువెలరీ నుంచి బుధవారం తెల్లవారుజామున రూ.13 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలను ఇద్దరు దొంగలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొందరు అనుమానితులను పుదుకోట్టైలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఓ దొంగ చిక్కాడని పోలీసులు తెలిపారు.
‘తిరువారూర్ సమీపంలోని విళమల్ అడియక్కమంగలం చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సుమారు కిలోమీటరు దూరం వారిని వెంబడించగా అట్టపెట్టెతో సహా ఓ వ్యక్తి చిక్కాడు. పెట్టెలో నాలుగున్నర కిలోల బంగారు ఆభరణాలు కనిపించాయి. ఆ వ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడిందని’ తెలిపారు.
పట్టుబడిన నిందితుడు తిరువారూర్కు చెందిన మణికంఠన్(32)గా గుర్తించారు పోలీసులు. ఇతడు పాత నేరస్థుడేనని కూడా తెలిపారు. అయితే ఇంట భారీ చోరికి మాత్రం పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు పేర్కోన్నారు, గతంలో మణికంఠన్ ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డాడని కూడా పోలీసుల తెలిపారు. కాగా, పరారీలో ఉన్న వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సురేష్గా పేర్కొన్నారు. వీరిద్దరూ చోరీకి పాల్పడిన తర్వాత నగలను పంచుకున్నారని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more