ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసుల భద్రత నడుమ బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు.
మరోవైపు బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు యత్నిస్తున్నాయి. దీంతో కార్మిక సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పలు చోట్ల కార్మికుల సమ్మెకు సంఘీభావంగా విపక్షాలు కూడా ధర్నా చేస్తున్నాయి. పోలీసుల భద్రత నడుమ ప్రైవేట్ డ్రైవర్లతో పాక్షికంగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలోకి పోలీసులు ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన త్రిసభ్య ఐఏఎస్ కమిటీ కేసీఆర్ ను కలిసింది. గత మూడు రోజులుగా వారితో జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా తమను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలన్న డిమాండ్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తుంది.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలపై చర్చిస్తున్నారు. మూడు రోజులుగా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలపై సీఎంకు అధికారులు వివరిస్తున్నారు. అన్ని కోణాల నుంచి చర్చించి ఈ రాత్రికి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం స్పందన పట్ల కార్మిక సంఘాలు ఉత్కంఠగా ఎదురుచూస్తూనే.. మరోవైపు ఈ క్రియాశీలకసమయంలో తాము ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కు తగ్గకూడదనే నిర్ణయించుకున్నాయి. మరోపక్క టీఎస్ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు ఏపీఎస్సార్టీసీ ఈయూ నేతలు తమ మద్దతు ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, వీరికి మద్దతుగా అవసరమైతే ఏపీలో కూడా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని ఈయూ నేతలు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more