ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనయర్ నేత కోడెల శివప్రసాద్ రావు విగ్రహ ఏర్పాటులో వివాదం నెలకొంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించాలని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికోసం టీడీపీ శ్రేణులు ఆ ప్రాంతలో దిమ్మెను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కోడెల విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ చివరి నిమిషంలో అధికారులు టీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు. దీంతో లింగరావుపాలెంలో టెన్షన్ నెలకొంది.
కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ నేతలు తేల్చిచెప్పగా, అసలు ఆయన విగ్రహ ఏర్పాటు చేసే క్రమంలో అనుమతులు తీసుకోలేదని, దీంతో విగ్రహ ఏర్పాటును అనమతించేది లేదని అధికారులు భ్మీషించడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈ నేపథ్యంలో పంచాయితీ అధికారులు పిర్యాదు మేరకు ఇవాళ తెల్లవారు జామునే రంగంలోకి దిగిన పోలీసులు.. అధికారుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య విగ్రహ దిమ్మెను ధ్వంసం చేశారు.
కాగా, విగ్రహ దిమ్మె కూల్చివేత సమయంలో ఇరు వర్గాలకు మధ్య కొంత వాగ్వాధం చోటుచేసుకుంది. దీంతో కొంత సమయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి, అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణించిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులు అరోపిస్తున్నారు. కొడెల విగ్రహం ఏర్పాటు నిమిత్తమై వారం క్రితమే కలెక్టర్ అనుమతి కోరామని తెలిపారు.
కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపే కారణమని విగ్రహ ఏర్పాటు విషయంలో మరోమారు రుజువైందని వారు దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్ విషయంలో విమర్శలు వస్తే మరణించిన మనిషిపైనా బురదజల్లుతున్నారన్న సీఎం.. ఇప్పుడు కోడెల విషయంలోనూ అదే బురదను ఎందుకు జల్లుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారులతో పాటు పోలీసుల చర్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more