అల్పాహారం చేయాలని ఏ హోటల్ కు వెళ్లినా.. కనీసం రూ.50 సమర్పించుకోవాల్సిందే. అలాంటిది రూపాయికే టిఫిన్ అందించాలంటే? ఇలాంటి అసాధ్యాన్ని తమిళనాడులోని ఓ బామ్మ సుసాధ్యం చేసి చూపిస్తోంది. కోయంబత్తూరులోని కమలాథల్(82) గత 30 ఏళ్లుగా ఓ చిన్న హోటల్ను నడుపుతోంది. ఈ హోటల్ కు ప్రతిరోజూ 3నుంచి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి టిఫిన్ అరగించే కస్టమర్లు వున్నరంటే ఆ హోటల్ ప్రత్యేకత ఏమైవుంటుంది.
రూపాయికే టిఫిన్ అంటే మాత్రం కస్టమర్లు వస్తారా.? అంతకన్నా మరింత ముఖ్యమైన రుచి, అమె చేసే పలహారం రుచులు, చట్నీల రుచి అక్కడివారికి భలే నచ్చేశాయి. రూపాయికి టిఫిన్ పెట్టడం అదీనూ రుచికరమంటే.. ఆ టిఫిన్ సెంటర్ వద్ద బారులు తీరే కస్టమర్లు వుండటం అతిశయోక్తి కాదు. ఈ 82 ఏళ్ల బామ్మ దినచర్య కూడా అలాంటిదే. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేస్తుంది.
అనంతరం రోజుకు వెయ్యి ఇడ్నీలు, బోండాలు(మైసూర్ బజ్జీలు) తయారు చేస్తుంది. ఉదయం 6 గంటలకల్లా తన షాపును తెరుస్తుంది. ఆమె తయారుచేసిన ఇడ్లీ, సాంబార్, చట్నీ రుచి నోటిమాటగా వ్యాపించడంతో చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ టిఫిన్ తినిపోతూ ఉంటారు. ఈ హోటల్ లో కమలాథల్ ఒక్కో ఇడ్లీని రూపాయికే అందిస్తోంది. దీంతో రూ.10 పెట్టగానే కస్టమర్ల కడుపు నిండిపోతోంది.
ఈ విషయమై కమలాథల్ మాట్లాడుతూ..‘గత 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నా. గతంలో ఒక్కో ఇడ్లీ, బోండాను 50 పైసలకే అందించేదాన్ని. అయితే సరుకుల ఖరీదు పెరగడంతో రూపాయికి అమ్ముతున్నా. అందరూ నా టిఫిన్ ను మెచ్చుకుంటారు’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఎవరైనా డబ్బులు లేకుండా టిఫిన్ తిన్నా, పది రూపాయలకు తిని, రూ.5లే చేతిలో పెట్టినా ఈ బామ్మ వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయట.
One of those humbling stories that make you wonder if everything you do is even a fraction as impactful as the work of people like Kamalathal. I notice she still uses a wood-burning stove.If anyone knows her I’d be happy to ‘invest’ in her business & buy her an LPG fueled stove. pic.twitter.com/Yve21nJg47
— anand mahindra (@anandmahindra) September 10, 2019
కోయంబత్తూరులో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న బామ్మ కమలాథల్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. 82 ఏళ్ల వయస్సులోనూ అమె ఎవరిపై ఆధారపడకుండా తన పని తాను చేసుకోవడంతో పాటు పది మందికి అల్పాహారం అందించాలన్న తపన అమెను నేటి అన్నపూర్ణగా మార్చివేసిందని, వందల మంది ఆకలిని తీర్చడం అభివర్ణించారాయన. 'ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయని అన్నారు.
మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది. కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టవ్ ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె వివరాలను ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ లో పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more