జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి మార్చేస్తున్నారని ఆ ప్రాంత రైతులు ఇటీవల ఆయనను హైదరాబాద్ లోని జనసేన కార్యలయంలో కలసి తమ భాధను మెరపెట్టుకున్నారు. దీంతో తాను అమరావతిలో పర్యటిస్తానని వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని వారికి హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇవాళ అన్నమాట మేరకు అమరావతిలో పర్యటిస్తున్నారు. మంగళగిరి మండలం నిడమర్రు నుంచీ పవన్ కళ్యాణ్ తన పర్యటన ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పనులను పరిశీలిస్తూ కాన్వాయ్ లో పర్యటన సాగిస్తున్నారు. రోడ్లు, భవనాలు, ఎత్తిపోతల పథకాల్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలను పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. వారు చెప్పే సమస్యలను కూడా ఆయన మార్గమధ్యంలో వింటూ ముందుకు సాగుతున్నారు. భూ సమీకరణ ఒప్పందం అమలు వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయనకు అడుగడుగునా... అభిమానులు, స్థానికులూ స్వాగతం పలుకుతున్నారు. ఇక ఇవాళ సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రైతులతో సమావేశమై సమస్యలను తెలుసుకోనున్నారు.
అమరావతే రాష్ట్రానికి రాజధానిగా వుండాలని తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్.. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తరువాత తన పార్టీ స్టాండ్ ఏమిటో తెలుపనున్నారు. ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష్ నిర్వహించడం.. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందా అన్నట్లుగా మరోమారు మంత్రి బొత్సా అస్పష్ట ప్రకటన చెయ్యడంతో.. ఇప్పటికీ అమరావతి రైతుల్లో రాజధానిపై అలుముకున్న నీలినీడలు అలాగే కొనసాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more