పాకిస్తాన్ తన తోక మాత్రమే కాదు తన బుద్ది కూడా వంకరేనని మరోమారు నిరూపించుకుంది. ఓ వైపు అగ్రరాజ్యం వెళ్లి ఆ దేశ ప్రధాని ఉగ్రవాదుల సంఖ్యతో పాటు ఎన్ని ఉగ్రవాద సంస్థలు వున్నాయో అన్న వివరాలను కూడా చెప్పి.. ఎలా బతుకుతామోనని అంగలార్చి.. ఇటు నియంత్రణ రేఖ వద్ద మాత్రం ఓ వైపు ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తూనే.. మరో వైపు భద్రతా దళాల దృష్టి మరల్చేందుకు మరో చోట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడుస్తున్నారు.
కాగా, పాకిస్తాన్ దొంగబుద్దిని కనిపెడుతున్న భారత భద్రతాదళఆలు మాత్రం ఉగ్రవాదుల చోరబాట్లను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అక్రమ చోరబాట్లకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్లోని బక్తూర్ గురేజ్లో మంగళవారం మధ్యాహ్నం మారణాయుధాలు ధరించిన కొందరు చొరబాటుదార్లు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఎన్కౌంటర్ భీకరంగా జరుగుతోంది.
అనంత్నాగ్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒక ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తనను తాను కమాండర్గా ప్రకటించుకున్నట్టు భద్రతాధికారులు తెలిపారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనక హతమైన ఉగ్రవాది పంజూ అలియాస్ ఫయాజ్ అహ్మద్ థోకర్ అలియాస్ హజుల్లా బై హస్తం ఉందని, ఈ దాడిలో అతడు సహ కుట్రదారుడని ఆర్మీ తెలిపింది. పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more