ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు నుంచి గవర్నర్గా ఉన్న నరసింహన్, ఇరు తెలుగు రాష్ట్రాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఉమ్మడి గవర్నర్నే కొనసాగిస్తున్నారు. అంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ 2009 నుంచి కొనసాగుతూ వస్తున్నారు. కాగా రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్ పదేళ్లకు పైగా కొనసాగుతున్నారని, ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్ దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నారని, ఆయనను ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహన్ను బదిలీ చేయడమో, జమ్మూ కశ్మీర్ వ్యవహారాల సలహాదారుగా నియమించడం జరుగుతుందని హోంశాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. అందులో భాగంగానే కొత్త గవర్నర్ల నియామకం జరగొచ్చని హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more