కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనను ఆశనిపాతంలా వెంటాడతానని చెప్పిన బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అనుకున్నంత పనీ చేస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీకి అమె గట్టి పోటీ ఇస్తున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం రాహుల్ కంటే స్మృతి ముందంజలో ఉన్నారు. రాహుల్పై 5 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో స్మృతి కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ తొలిసారి రెండు పార్లమెంటు స్థానాల నుంచి బరిలోకి దిగడాన్ని కూడా అస్త్రంగా మార్చుకున్న అమె.. దానినే ప్రచారాస్త్రంగా చేసుకుని అమేధీ ప్రజల మనసు గెలిచారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. వయనాడ్లో ఆయన గెలుపు నల్లేరుమీద నడకలా భావిస్తుండగా, అమేథీలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై పలు వివాదాస్పద వ్యాక్యలు కూడా చేశారు స్మృతి ఇరానీ. అక్కడ మైనారిటీలు అధిక సంఖ్యలో వున్నారు కాబట్టే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లిపోయాడని.. అమేధీని వదిలేశాడని అమె గుప్పించిన విమర్శలు కూడా అక్కడి ఓటర్లపై ప్రభావం చూపాయా.? అన్న సందేహాలు మాత్రం కలగకమానదు.
గత ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓటమి పాలైన స్మృతి ఈసారి మాత్రం కాంగ్రెస్ చీఫ్కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వా-నేనా? అన్నట్టుగా ఉంది. కాగా, స్మృతిపై రాహుల్ గతంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాహుల్ 2.70 లక్షల ఓట్లు సాధించారు. ఇదిలావుంటే 1998 నుంచి కాంగ్రెస్ కంచుకోటాగా వుంటూ వస్తున్న అమేధీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాషాయ జెండాను ఎగురవేస్తారా.? లేదా రాహుల్ తన సత్తాను చాటుకుంటారా.? అన్నది వేచి చూడాల్సిందే. 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ తన స్థానాన్ని రాయ్బరేలీకి మార్చుకోవడంతో అప్పటి నుంచి ఆ స్థానంలో రాహుల్ బరిలోకి దిగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more